NTV Telugu Site icon

Devara : ‘జాన్వీ’ బాయ్ ఫ్రెండ్ షాక్!

Devara

Devara

Devara : దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు చేసిన రాని స్టార్ డమ్ దేవరతో వస్తుందని నమ్మకంతో ఉంది జాన్వీ. ఈ సినిమా రిలీజ్‌కు ముందే అమ్మడికి ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ పెరిగింది. కానీ దేవరలో మాత్రం జాన్వీ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది. ఆమె పోషించిన తంగం పాత్ర ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. ఒక్క పాట రెండు మూడు సీన్లకు పరిమితమవడంతో.. అమ్మడి ఫ్యాన్స్ కాస్త్ హర్ట్ అయ్యారు. కానీ జాన్వీ బాయ్ ఫ్రెండ్ మాత్రం షాక్ అయ్యాడు. జాన్వీ కపూర్ చాలా కాలంగా శిఖర్‌ పహరియాతో ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు చాలా సార్లు తిరుమలకు వచ్చారు.

Also Read: Dana Kishore : గతంలో మూసీకి భారీగా వరదలు వచ్చాయి.. గతంలోనూ నిర్వాసితులను తరలించారు.

అలాగే.. ముంబైలో చెట్ట పట్టాలేసుకొని తిరుగుతుంటారని బాలీవుడ్ కోడై కూస్తుంటుంది. ఈ నేపథ్యంలో.. దేవర సినిమా చూసిన శిఖర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తను జాన్వీ న‌ట‌న‌కు ఫిదా అయినట్లు.. తంగం అందానికి మ‌తిపోయినట్లు.. సింప్లీ సూప‌ర్బ్ యాక్టింగ్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. ‘నేనేమైనా కలగంటున్నానా? అంటూ.. దేవర మూవీలోని జాన్వీ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. దీంతో జాన్నీ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురైనప్పటికీ.. ఆమె బాయ్ ఫ్రెండ్ మాత్రం ఫుల్ హ్యాపీ అనే చెప్పాలి. కాగా శిఖర్‌ పహరియా… మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్‌ షిండే మనవడు అనే విష‌యం తెలిసిందే. వీరిద్దరి ప్రేమ గురించి బాలీవుడ్ లో ఎన్నోసార్లు అనేక రకాల ప్రచారాలు జరిగాయి. వీరిద్దరు కూడా చట్టా పట్టాలు వేసుకుని ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు.