పిక్ వైరల్ : ఆర్యన్ కు బెయిల్… లీగల్ టీంకు షారుఖ్ పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు గురువారం బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చిన తర్వాత షారూఖ్ ఖాన్ తన న్యాయవాద బృందాన్ని కలిశారు. షారూఖ్, అతని లీగల్ టీమ్ కెమెరాను చూసి నవ్వుతూ కనిపిస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం మేరకు ఆర్యన్ కు బెయిల్ రావడంపై సంతోషం వ్యక్తం చేసిన షారుఖ్ తన లీగల్ టీం కు పార్టీ ఇచ్చారట. ఇప్పుడు వైరల్ అవుతున్న పిక్ దానికి సంబంధించిందే అని తెలుస్తోంది.
అక్టోబరు 2న క్రూయిజ్ షిప్పై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసింది. అరెస్టు అనంతరం పలు నాటకీయ పరిణామాల మధ్య ఆర్యన్ ఖాన్ మూడు వారాల పాటు కస్టడీలో ఉన్నాడు. ఇన్ని రోజులూ ఆయన ఆర్ధర్ రోడ్ జైలులో గడిపాడు. కాగా ఆర్యన్ ఖాన్ తరపున న్యాయవాది సతీష్ మనేషిండే బృందం కోర్టులో వాదించారు. ఆర్యన్ కు బెయిల్ వచ్చిన తరువాత న్యాయవాది సతీష్ మాట్లాడుతూ “ఆర్యన్ షారూఖ్ ఖాన్ చివరికి హెచ్సి బెయిల్పై విడుదలయ్యాడు. అక్టోబరు 2, 2021న అతన్ని అదుపులోకి తీసుకున్న మొదటి క్షణం నుండి ఇప్పటి వరకూ ఆర్యన్ దగ్గర ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. అలాగే డ్రగ్స్ కు సంబంధించిన ఆధారాలు, వినియోగం వంటివి ఏమీ దొరకలేదు. మా ప్రార్థనలను మిస్టర్ జస్టిస్ నితిన్ సాంబ్రే అంగీకరించి, ఆర్యన్కి బెయిల్ మంజూరు చేసినందుకు మేము దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సత్య మేవ జయతే” అని అన్నారు. విచారణ సందర్భంగా ఆర్యన్ ఖాన్పై వాట్సాప్ చాట్లు ‘బల్క్ క్వాంటిటీ’ డ్రగ్స్ను సూచించాయని ఎన్సిబి వాదించింది.
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
Read Also : “సర్కారు వారి పాట”లో ఎవరెవరు ఏఏ పాత్రలు చేస్తున్నారంటే ?
ఆర్యన్ ఖాన్ బెయిల్ను పురస్కరించుకుని షారుఖ్ ఖాన్ అభిమానులు ఆయన నివాసం మన్నత్ వెలుపల బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కేసులో అర్బాజ్ మర్చంట్, మున్ముమ్ ధమేచాకు కూడా బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అక్టోబరు 2న సముద్రం మధ్యలో గోవాకు వెళ్తున్న కోర్డెలియా క్రూయిజ్ షిప్లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై ఎన్సిబి బృందం దాడి చేసింది. ఈ కేసులో ఇద్దరు నైజీరియన్ లతో సహా మొత్తం 20 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు. అందులో భాగంగానే ఆర్యన్ ఖాన్, మర్చంట్, ధమేచాలను ఎన్సీబీ అక్టోబర్ 2న అరెస్టు చేసింది. నిషేధిత డ్రగ్స్ కలిగి ఉండటం, వినియోగం, అమ్మకం/కొనుగోలు, కుట్ర, ప్రేరేపణకు సంబంధించి నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ (NDPS) సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!