Adipurush గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో దర్శకుడు ఓం రౌత్ కూడా జక్కన్న బాటనే ఎంచుకున్నాడు అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ‘బాహుబలి’తో దర్శక దిగ్గజం రాజమౌళి సృష్టించిన సీక్వెల్ ట్రెండ్ మామూలుది కాదు. ఇప్పుడు Adipurushకు కూడా సీక్వెల్ రానుందనేది తాజా న్యూస్. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ‘ఆదిపురుష్’ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ప్రేరణతో తెరకెక్కుతున్న ఈ ఎపిక్ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, కృతి సనన్ సీతగా కనిపించనుంది. ఈ పీరియాడిక్ ఫిల్మ్లో సైఫ్ అలీఖాన్ లంకేశ్వరుడి పాత్రలో నటించారు. టి సిరీస్, రెట్రోఫిల్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం VFX పనులు శరవేగంగా జరుగుతుండగా, 2023 జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
Read Also : KGF Chapter 2 : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హోస్ట్ గా టాప్ ప్రొడ్యూసర్
అయితే త్వరలో ‘ఆదిపురుష్’ సీక్వెల్ ఉంటుందనే ఇప్పుడు బజ్ నడుస్తోంది. Adipurush దర్శకుడు ఓం రౌత్ సీక్వెల్ ఆలోచనలో ఉండగా, ప్రభాస్ కూడా దీనికి సానుకూలంగానే స్పందించాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్న టీం త్వరలోనే కమర్షియల్ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారని టాక్. ఫైనల్ స్క్రిప్ట్ ఓకే అయితే వచ్చే ఏడాది ‘ఆదిపురుష్’ సీక్వెల్ కోసం ప్రభాస్ డేట్స్ కేటాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిటింగ్ తప్పదు ! మరోవైపు ప్రభాస్ త్వరలో ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.