NTV Telugu Site icon

Chiranjeevi: ఈ ఇద్దరు డైరెక్టర్స్ తో ఒక్క సినిమా పడినా.. బాక్సాఫీస్ షేప్ మారిపోతుంది మావా..

Cjiru

Cjiru

Chiranjeevi: సాధారణంగా ఇండస్ట్రీలో కొన్ని కాంబోలపై బీభత్సమైన అంచనాలు ఉంటాయి. ఒక రా అండ్ రస్టిక్ డైరెక్టర్ చేతికి ఒక స్టార్ హీరో చిక్కాడు అంటే ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని కాదు దానికి మించి ఉంటాయి. అదే ఒక అభిమాని డైరెక్టర్ గా మారి.. తన అభిమాన హీరోతో సినిమా చేస్తే..నెక్స్ట్ లెవెల్ కదా.. ఇంతకీ ఆ కాంబో ఏంటి.. ? ఎందుకు ఇప్పుడు ఇదంతా చర్చించుకుంటున్నాం అంటే.. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం తెల్సిందే. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి.. చిరుకు ఈ గౌరవాన్ని అందించింది. ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీ మొత్తం చిరు ఇంటి ముందు క్యూ కట్టింది. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖులు.. చిరును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు సెన్సేషనల్ డైరెక్టర్స్ చిరును కలవడం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

వారెవరో కాదు.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. వీరిద్దరూ.. చిరును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇకచిరు.. వీరితో కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అనిమల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు సందీప్. దసరా లాంటి రా అండ్ రస్టిక్ సినిమాతో టాలీవుడ్ ను షేక్ చేశాడు శ్రీకాంత్ ఓదెల. వీరిద్దరూ.. చిరు ఫ్యాన్స్ కావడం విశేషం. సందీప్ ఎప్పటి నుంచో చిరుతో ఒక సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ దసరా తరువాత స్టార్ హీరోల నుంచి పిలుపు వస్తుందని ఎదురుచూస్తున్నాడు. వీరిద్దరితో చిరు సినిమా ఒక్కటి పడినా కూడా బాక్సాఫీస్ షేప్ మారిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తికాదని చెప్పొచ్చు. మరి చిరు.. వీరిలో ఎవరినో ఒకరిని ఓకే చేస్తాడేమో చూడాలి.