Prithviraj: సలార్ విలన్ 25 కోట్ల ఫైన్ కట్టాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజులో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. ప్రస్తుతం ప్రభాస్ చాలా సినిమాలు చేస్తున్నాడు కానీ సలార్ మూవీపై ఉన్నన్ని అంచనాలు మరో సినిమాపై లేవు. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసిన సలార్ సినిమా ఇండియాలోనే హయ్యస్ట్ బడ్జట్ తో రూపొందుతున్న కమర్షియల్ డ్రామాగా హిస్టరీ పేరు తెచ్చుకుంది. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ కి విలన్ గా, జగపతి బాబు కొడుకుగా మలయాళ స్టార్ హీరో ‘పృథ్వీరాజ్ సుకుమారన్’ నటిస్తున్నాడు. వరదరాజ్ మన్నార్ అనే పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నాడు, ఈ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇందులో పృథ్వీరాజ్ చాలా వయోలెంట్ గా కనిపించాడు. సలార్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్న ఈ మలయాళ స్టార్ హీరో, హిందీలో సినిమాలని ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాడు. ఇటివలే అక్షయ్ కుమార్ హీరోగా సెల్ఫీ సినిమాని ప్రొడ్యూస్ చేసిన పృథ్వీరాజ్, బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలని నిర్మించడానికి రెడీ అయ్యాడు. దీంతో పృథ్వీరాజ్ పై కేరళ మీడియాలో కొన్ని నెగటివ్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి.
ఇటివలే పృథ్వీరాజ్ పై ఈడీ రైడ్స్ జరిగాయి, ఈ సంధర్భంగా కొన్ని మీడియా సంస్థలు పృథ్వీరాజ్ ఈడీకి 25 కోట్ల ఫైన్ కట్టాడని కొన్ని ఆర్టికల్స్ ని ప్రచురించాయి. ఇది మాత్రమే కాకుండా పృథ్విరాజ్ సుకుమారన్ ప్రాపగెండా సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనే మాట కూడా కేరళ మీడియాలో వినిపిస్తోంది. ఈ విమర్శలు ఎక్కువ అవ్వడంతో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. “నేను ఈడీ వాళ్లకి 25 కోట్లు ఫైన్ కట్టాను, ప్రాపగెండా సినిమాలని చేస్తున్నాను అని నాపై అబద్ద ప్రచారం జరుగుతోంది. మాములుగా అయితే ఇలాంటి విషయాలని అసలు పట్టించుకునే వాడిని కాదు కానీ కొందరు అదే పనిగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అందుకే అలా చేసే వారందరి పైన లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను” అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ ట్వీట్ చేశాడు. ఏడాదికి ఆరు ఏడు సినిమాలు చేసే పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంత సీరియస్ గా రియాక్ట్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడితో అయినా ఆ అసత్య ప్రచారాలు చేసే వాళ్లు సైలెంట్ అవుతారేమో చూడాలి.
Also Read
- The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
- Nagadurga: సుకుమార్ - బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
- Viswanath and Sons : అనిల్ రావిపూడి తరహాలో వెంకీ అట్లూరి... ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రమోషన్స్ షురూ....
- Anandita Surgery Rumours : అలాంటి సర్జరీలు చేయించుకోలేదు... ట్రోలర్స్ పై మండిపడ్డ ఖుష్బూ కూతురు
I usually tend to ignore these because terms like “ethical journalism” are fast becoming redundant in the times we live in. But there is a limit to propagating absolute lies in the name of “news”. This is a fight I intend to see through to the end. Filing civil and criminal… pic.twitter.com/Yv6ozvd0W2
— Prithviraj Sukumaran (@PrithviOfficial) May 11, 2023
తాజావార్తలు
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?