Sai Dharam Tej: నేను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు, తప్పుడు ప్రచారం చెయ్యకండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరుపాక్ష సక్సస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయిదు రోజుల్లోనే దాదాపు 60 కోట్ల వరకూ రాబట్టి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు తేజ్. ఇలాంటి సమయంలో సాయి ధరమ్ తేజ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. సెప్టెంబర్ 10, 2021 రాత్రి సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ సమయంలో తీవ్ర గాయలయ్యి రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన తేజ్ ని అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి గుర్తించి సకాలంలో హాస్పిటల్ చేర్చి సాయం అందించాడు. ఈ ఘటన జరిగిన రెండ్రోజులకు “అబ్దుల్కు మెగా ఫ్యామిలీ వరాలు… లక్ష రూపాయల నగదు, కారు, బైకు, బంగ్లా బహుమతిగా “ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కరు కొట్టాయి. అయితే ఆ వార్తలో నిజం లేదని విరూపాక్ష విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూల్లో తేజ్ క్లారిటీ ఇచ్చేశాడు. “పునర్జన్మను ఇచ్చిన అతనికి ఓ లక్ష ఇచ్చి చేతులు దులిపేసుకోవడం నాకు ఇష్టం లేదు. మా ఫ్యామిలీ నుంచి ఎవరైనా సాయం చేశారేమో కానీ నాకు ఆ విషయం తెలియదు. దాని గురించి నేను ఎవరిని అడగలేదు. అబ్దుల్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అనే విషయం తెలుసు, తనకి ఏ సాయం కావలసినా నేరుగా ఫోన్ చేసి అడగొచ్చని హామీ ఇచ్చాను. అబ్దుల్ కి డైరెక్ట్ ఫోన్ నంబర్ కూడా ఇచ్చాం’’ అంటూ తేజ్ క్లారిటీ ఇచ్చాడు.
లేటెస్ట్ గా ఈ విషయంలో సాయి ధరమ్ తేజ్ అండ్ టీంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ నెగటివ్ ప్రచారం సాయి ధరమ్ తేజ్ వరకూ వెళ్లడంతో “నాపై, నా టీమ్పై దుష్ప్రచారం జరుగుతోందని తెలిసింది. ఇటీవల నేను ఇంటర్వ్లూలో చెప్పినట్లు నేను కానీ, నా టీమ్ కానీ అబ్దుల్కి ఎలాంటి రివార్డ్ ఇవ్వలేదు. అందుకు కారణం.. ఎంతోకొంత డబ్బు ఇచ్చి సరిపెట్టేద్దాం అనుకోవడం లేదు. అతను చేసిన సాయానికి నేను, నా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటాం. అతనికి ఏ సాయం కావాలన్ని కోరమని నాది, మా మేనేజర్ నంబర్స్ ఇచ్చాం. అతను ఎప్పుడు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంపై ఇకపై మాట్లాడాలనుకోవడం లేదు” అంటూ సాయిధరమ్ తేజ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. మరి ఇక్కడితో అయినా ఈ యాక్సిడెంట్ విషయంలో తేజ్, అబ్దుల్ కి అందించిన విషయంలో వినిపించే రూమర్స్ ని ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!