యాక్షన్ చిత్రాలతో నటుడిగా తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్ ఇప్పుడు మరో యాక్షన్ డ్రామా ‘సామాన్యుడు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తు పా శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. తాజాగా ‘సామాన్యుడు’ టీజర్ ను ఈరోజు విడుదల చేశారు మేకర్స్. టీజర్ పూర్తిగా విశాల్ యాక్షన్ తో నిండిపోయింది. అధికారంలో ఉన్న వ్యక్తులపై సామాన్యులు చేసే పోరాటమే ఈ సినిమా అని టీజర్ ద్వారా స్పష్టం చేశారు.
విశాల్ ‘సామాన్యుడు’ తమిళంలో ‘వీరమే వాగై సూదుం’ అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇక టీజర్లో ఉన్న యాక్షన్ సన్నివేశాలు వాస్తవికంగా, నిజ జీవితానికి దగ్గరగా కనిపించాయి. యువన్ శకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. విశాల్ తన హోమ్ బ్యానర్ అయిన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై నిర్మించిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. ఈ తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం 2022 జనవరి 26న విడుదల కానుంది.
