ఆర్ఆర్ఆర్: మీకు మీరే.. మాకు మేమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’… ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. రోజురోజుకి అంచనాలు ఎక్కువ అవ్వడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఆర్ఆర్ఆర్ అక్టోబర్13న వస్తుందో, లేదో క్లారిటీ లేదు. ఇటీవలే ఉక్రెయిన్లో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్తో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా విడుదల తేదీని బేస్ చేసుకొని చాలా సినిమాలు విడుదల తేదీని ప్రకటించడం ఆలస్యం చేస్తున్నాయి. ఒకవేళ జక్కన్న దసరాకు ఆర్ఆర్ఆర్ విడుదల చేసే ఉద్దేశ్యం ఉంటే ఓ సమావేశం పెట్టి చెప్పాలనే డిమాండ్ గట్టిగానే వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ దసరా బరిలో నుంచి తప్పుకుంటే ఆచార్య, అఖండ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు విడుదల తేదీలను ప్లాన్ చేసుకొనే పనిలో ఉన్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ టీం నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోవడంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ‘మీకు మీరే.. మాకు మేమే..’ అనే ధోరణి మంచిది కాదనేది కొందరి వాదన.. ప్రస్తుతం జక్కన్న థియేటర్లోకి వచ్చే ప్రేక్షకులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మరోపక్క థర్డ్ వేవ్ హెచ్చరికలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. త్వరలోనే ఆర్ఆర్ఆర్ బృందం మీడియా సమావేశం పెట్టి విడుదల తేదీపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం