దర్శక థీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ జనవరి 7వ తేదీ వరల్డ్ వైడ్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా పబ్లిసిటీలో వేగాన్ని పెంచారు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఇందులో పూర్తి స్థాయిలో లీనమై, మూవీని మరో లెవెల్ కు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 9వ తేదీ నుండి థియేటర్లలో చూడొచ్చని తెలిపారు రాజమౌళి. ఇప్పటికే ‘ట్రిపుల్ ఆర్’ మూవీ టీజర్ వివిధ నగరాల్లోని థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. రోమాంచితులను చేస్తున్న ఈ టీజర్ ను చూసిన వారంతా మూవీ రిలీజ్ డేట్ కోసం ఇప్పటి నుండే ఎదురుచూస్తున్నారు. ఇక రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ కూడా థియేటర్లలో రిలీజ్ చేస్తే… రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి ప్రాణం పెట్టి స్వరరచన చేయగా, కె.కె. సెంథిల్ విజువల్ ఫీస్ట్ లా సినిమాటోగ్రఫీని అందించారు.