RRR మార్చి 25న దేశంలోనే అతిపెద్ద విడుదలకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఈ మ్యాగ్నమ్ ఓపస్ మూవీ టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాష్ట్రాల్లో రోజుకు ఐదు షోలు ప్రదర్శించడానికి అనుమతి మంజూరు చేశాయి. హైదరాబాద్లో స్పెషల్ పెయిడ్ ప్రీమియర్లు మార్చి 25న ఉదయం 1 గంటలకు ప్రారంభమవుతాయి. నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ప్రీమియర్ షోలను కోటి రూపాయలకు విక్రయించారు. భ్రమరాంబ, మల్లిఖార్జున, విశ్వనాథ్, అర్జున్, శ్రీరాములు, విజేత థియేటర్లలో ఉదయం 1 గంటలకు స్పెషల్ ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు.
Read Also : Radheshyam : తుస్ అంటగా… బాబు గోగినేని సెటైర్లు
‘వలిమై’ని తెలుగులో రిలీజ్ చేసిన ప్రముఖ ఓవర్శిస్ డిస్ట్రిబ్యూటర్ ఇన్నమూరి గోపీచంద్ భారీగా చెల్లించి ప్రీమియర్ షోలను సొంతం చేసుకున్నారు. స్పెషల్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. ఈ ప్రత్యేక ప్రీమియర్ల టిక్కెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఏపీ, తెలంగాణల్లో రెగ్యులర్ షోలు అన్ని థియేటర్లలో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఏపీ, తెలంగాణలోని అన్ని థియేటర్లలో ఈ వారాంతంలో ‘ఆర్ఆర్ఆర్’ను ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.