Rashmi Gautam: జీవితాలను రిస్క్లో పెట్టింది ఎవరు?.. అలా వదిలేయకండి ప్లీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmi Gautam Comments on Infant Death Due to Dog: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నటి, యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా చేసిన ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఒక పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన తెలంగాణలోని తాండూర్ లో జరిగింది. దీంతో వెంటనే ఆ కుక్కని తల్లిదండ్రులు కొట్టి చంపేశారు, ఇక ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక నిటిజన్ ఇప్పుడు ఆ కుక్కని చంపినందుకు చిన్నారి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని రశ్మి అంటుందంటూ కామెంట్ చేశాడ. ఆ కామెంట్ కి స్పందిస్తూ రష్మీ సుదీర్ఘమైన ట్వీట్ చేసింది. అసలు ఆ చిన్నారిని ఎందుకలా వదిలేశారు? కుక్క దాడి చేస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు నిద్రపోతున్నారా? కనీసం బాబు ఏడుపు కూడా వినిపించలేదా? అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. జంతువుల మీద ఇలాంటి ప్రచారం చేయొద్దు, తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రులకు సంబంధించిన వెయ్యి వీడియోలు నేను కూడా షేర్ చేస్తాను. అసలు నిజానికి పిల్లలు జీవితాన్ని రిస్క్లో పెట్టింది ఆ తల్లిదండ్రులే కదా. జంతువుల విషయానికొస్తే ఈ లాజిక్స్ అన్ని మరిచిపోతారా అంటూ ఆమె కామెంట్ చేసింది.
AP Elections 2024: అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగిన ఓటింగ్.. తుది పోలింగ్ శాతం ఎంతంటే?
Also Read
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్కు అడుగు దూరంలో!
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేశాయి
ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేసి మీరు మాత్రం ప్రశాంతత పొందాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదని ఆమె కామెంట్ చేసింది. ఇక ఈ స్పందనకు మరొక నెటిజెన్ స్పందిస్తూ మీకు బుర్ర లేదని అర్థమైంది ఇలా అంటున్నందుకు తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ కామెంట్ చేయగా దానికి ఆమె స్పందిస్తూ నాకు బుర్ర లేదు కానీ మీకు ఉంది కదా కనడమే కాదు, ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే, దయచేసి పెంపుడు జంతువులు ఉన్న వాళ్ళు పిల్లల్ని అలా వదిలేయొద్దు అని ఆమె కామెంట్ చేసింది. ఇక 24 గంటలు పిల్లలతోనే ఎవరు ఉండలేరు, రేపు మీరు కూడా ఉండలేరు అని ఒకరు కామెంట్ చేస్తే, మీరన్నది నిజమే అనుకోకుండా జరుగుతాయి కానీ ఏది ఒకే నిమిషంలో జరగదు. తల్లిదండ్రులు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా చూడాలంటూ రష్మి సమాధానం ఇచ్చింది. బయట వ్యక్తుల మీద దాడి చేయకుండా పెంపుడు జంతువులకు యజమానులు తగిన శిక్షణ ఇవ్వాలని, దాడి జరిగితే జంతువు యజమాని మీద కూడా కేసు పెట్టేలాగా చట్టాలు తీసుకురావాలన్నట్లు ఆమె కామెంట్ చేసింది. ఇక ఈ అంశం మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.
తాజావార్తలు
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..