Rashmi Gautam: జీవితాలను రిస్క్లో పెట్టింది ఎవరు?.. అలా వదిలేయకండి ప్లీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmi Gautam Comments on Infant Death Due to Dog: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నటి, యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా చేసిన ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఒక పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన తెలంగాణలోని తాండూర్ లో జరిగింది. దీంతో వెంటనే ఆ కుక్కని తల్లిదండ్రులు కొట్టి చంపేశారు, ఇక ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక నిటిజన్ ఇప్పుడు ఆ కుక్కని చంపినందుకు చిన్నారి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని రశ్మి అంటుందంటూ కామెంట్ చేశాడ. ఆ కామెంట్ కి స్పందిస్తూ రష్మీ సుదీర్ఘమైన ట్వీట్ చేసింది. అసలు ఆ చిన్నారిని ఎందుకలా వదిలేశారు? కుక్క దాడి చేస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు నిద్రపోతున్నారా? కనీసం బాబు ఏడుపు కూడా వినిపించలేదా? అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. జంతువుల మీద ఇలాంటి ప్రచారం చేయొద్దు, తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రులకు సంబంధించిన వెయ్యి వీడియోలు నేను కూడా షేర్ చేస్తాను. అసలు నిజానికి పిల్లలు జీవితాన్ని రిస్క్లో పెట్టింది ఆ తల్లిదండ్రులే కదా. జంతువుల విషయానికొస్తే ఈ లాజిక్స్ అన్ని మరిచిపోతారా అంటూ ఆమె కామెంట్ చేసింది.
AP Elections 2024: అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగిన ఓటింగ్.. తుది పోలింగ్ శాతం ఎంతంటే?
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేసి మీరు మాత్రం ప్రశాంతత పొందాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదని ఆమె కామెంట్ చేసింది. ఇక ఈ స్పందనకు మరొక నెటిజెన్ స్పందిస్తూ మీకు బుర్ర లేదని అర్థమైంది ఇలా అంటున్నందుకు తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ కామెంట్ చేయగా దానికి ఆమె స్పందిస్తూ నాకు బుర్ర లేదు కానీ మీకు ఉంది కదా కనడమే కాదు, ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే, దయచేసి పెంపుడు జంతువులు ఉన్న వాళ్ళు పిల్లల్ని అలా వదిలేయొద్దు అని ఆమె కామెంట్ చేసింది. ఇక 24 గంటలు పిల్లలతోనే ఎవరు ఉండలేరు, రేపు మీరు కూడా ఉండలేరు అని ఒకరు కామెంట్ చేస్తే, మీరన్నది నిజమే అనుకోకుండా జరుగుతాయి కానీ ఏది ఒకే నిమిషంలో జరగదు. తల్లిదండ్రులు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా చూడాలంటూ రష్మి సమాధానం ఇచ్చింది. బయట వ్యక్తుల మీద దాడి చేయకుండా పెంపుడు జంతువులకు యజమానులు తగిన శిక్షణ ఇవ్వాలని, దాడి జరిగితే జంతువు యజమాని మీద కూడా కేసు పెట్టేలాగా చట్టాలు తీసుకురావాలన్నట్లు ఆమె కామెంట్ చేసింది. ఇక ఈ అంశం మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!