బాలీవుడ్ లో రాశీఖన్నా సెకండ్ ట్రైల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా తన తాజా బాలీవుడ్ చిత్రం అప్ డేట్ ను షేర్ చేసుకుంది. ధర్మ ప్రొడక్షన్స్లో కరణ్ జోహార్ తీస్తున్న ‘యోధ’ చిత్రంలో తాను కూడా భాగం కానున్నట్టు తెలియచేసింది. దిశా పటానీతో కలసి ‘యోధా’ టీమ్లో చేరబోతున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా లోగోను కూడా షేర్ చేసింది. నిజానికి రాశిఖన్నా 2013లో జాన్ అబ్రహాం నటించిన ‘మద్రాస్ కేఫ్’ తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత బాలీవుడ్ లో రెండో సినిమా చేస్తోంది.
Read Also : వైరల్.. బిగ్బాస్-5 విన్నర్పై క్లారిటీ…!!
Also Read
‘యోధా’ వచ్చే ఏడాది నవంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. ఇందులో దేశాన్ని రక్షించే సైనికుడిగా సిద్ధార్థ్ కనిపిస్తాడట. నవంబర్ లో ఈ సినిమా తొలి రోజు షూటింగ్ నుంచి కొన్ని గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘యోధా’ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తొలి ఏరియల్ యాక్షన్ ఫ్రాంచైజీ. ఈ చిత్రానికి సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో దాదాపు కనుమరుగవుతున్న రాశీ ఖన్నా ఈ సినిమాతో బాలీవుడ్ లోనైనా నిలదొక్కుకుంటుందేమో చూడాలి.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
-
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
-
Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!