Rana Daggubati: ఆ కంపెనీ అమ్మేశా.. నాన్న, నేను మాట్లాడుకోవడం మానేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rana Daggubati: టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లీడర్ సినిమాతో దగ్గుబాటి రామానాయుడు మనవడిగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఒక పక్క హీరోగా, నటుడిగా నటిస్తూనే మంచి సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక నటుడిగా రాకముందు రానా VFX స్టూడియోను నడిపేవాడు. అయితే కొన్ని కారణాల వలన అమ్మేశాడు. ఇక ఈ కంపెనీ అమ్మేయడం వలన తాను చాలా ఇబ్బందులు పడ్డాను అని రానా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక బిజినెస్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎంతో ముఖ్యమైన స్పిరిట్ కంపెనీ గురించి రానా చెప్పుకొచ్చాడు.
Anasuya: పుష్పలో అల్లు అర్జున్ కొన్ని తప్పులు చేశాడు.. అనసూయ ఏమన్నదంటే ..?
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
“నేను 18 సంవత్సరాల క్రితం విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ స్పిరిట్ మీడియ ను ప్రారంభించాను. ఐదేళ్లు అందులో పనిచేశాను. బాహుబలి లాంటి ఒక సినిమాను ఆ సంస్థలో తీయాలని కలలు కన్నాను. కానీ నేను విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్న సమయంలో అలా జరగలేదు, అది 10 ఏళ్ల తర్వాత జరిగింది. ఈ వ్యాపారంలో మొదట నేనే ఉన్నాను అని అనుకున్నాను. ఉన్నాకొద్దీ.. దాని బాధ్యతలు ఖరీదైనవిగా మారాయి. నాలుగేళ్లు ఎలాగోలా నడిపాను.. ఇది నేను సరదాగా చేసే వ్యాపారం కాదు. ఇంకో ఐదో ఏట నా వాళ్ళ కాలేదు. అందుకే దానిని ప్రైమ్ ఫోకస్ కు అమ్మేశాను. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విజువల్ ఎఫెక్ట్ కంపెనీగా అవతరించింది. అయితే 2005లో ఎ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించాను. ఈ సినిమా అప్పట్లో విడుదలై రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అది థియేటర్ లో విడుదల కాలేదు. నేను నా విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని అమ్మవలసి వచ్చినందుకు నాకు ఇబ్బంది లేదు. కానీ నా కుటుంబం దృష్టిలో కంపెనీని అమ్మడం తప్పు. వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో తెలియకపోతే దాన్నుంచి తప్పుకోవడమే మార్గం అని నేను అనుకున్నాను. ఈ గొడవ మా ఇంట్లో నెల రోజులు నడిచింది. నేను, నాన్న మాట్లాడుకోవడం కూడా మానేశాం. కానీ, ఆ సమయంలో నాకు దొరికింది అదొక్కటే దారి. ఆ సమయంలో నాకు ఐఐఎం అహ్మదాబాద్లో మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేస్తున్న ఒక స్నేహితుడు ఉన్నాడు. అతనితో కంపెనీ గురించి రెండు వారాలు మాట్లాడి.. తిరిగివచ్చి కంపెనీని అమ్మేశాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!