Rana Daggubati: ఆ కంపెనీ అమ్మేశా.. నాన్న, నేను మాట్లాడుకోవడం మానేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rana Daggubati: టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లీడర్ సినిమాతో దగ్గుబాటి రామానాయుడు మనవడిగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఒక పక్క హీరోగా, నటుడిగా నటిస్తూనే మంచి సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక నటుడిగా రాకముందు రానా VFX స్టూడియోను నడిపేవాడు. అయితే కొన్ని కారణాల వలన అమ్మేశాడు. ఇక ఈ కంపెనీ అమ్మేయడం వలన తాను చాలా ఇబ్బందులు పడ్డాను అని రానా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక బిజినెస్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎంతో ముఖ్యమైన స్పిరిట్ కంపెనీ గురించి రానా చెప్పుకొచ్చాడు.
Anasuya: పుష్పలో అల్లు అర్జున్ కొన్ని తప్పులు చేశాడు.. అనసూయ ఏమన్నదంటే ..?
Also Read
- Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి - బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
- Peddi Censor Review : 'రంగస్థలం'ను మించిన యాక్టింగ్.... లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
- Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
“నేను 18 సంవత్సరాల క్రితం విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ స్పిరిట్ మీడియ ను ప్రారంభించాను. ఐదేళ్లు అందులో పనిచేశాను. బాహుబలి లాంటి ఒక సినిమాను ఆ సంస్థలో తీయాలని కలలు కన్నాను. కానీ నేను విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్న సమయంలో అలా జరగలేదు, అది 10 ఏళ్ల తర్వాత జరిగింది. ఈ వ్యాపారంలో మొదట నేనే ఉన్నాను అని అనుకున్నాను. ఉన్నాకొద్దీ.. దాని బాధ్యతలు ఖరీదైనవిగా మారాయి. నాలుగేళ్లు ఎలాగోలా నడిపాను.. ఇది నేను సరదాగా చేసే వ్యాపారం కాదు. ఇంకో ఐదో ఏట నా వాళ్ళ కాలేదు. అందుకే దానిని ప్రైమ్ ఫోకస్ కు అమ్మేశాను. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విజువల్ ఎఫెక్ట్ కంపెనీగా అవతరించింది. అయితే 2005లో ఎ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించాను. ఈ సినిమా అప్పట్లో విడుదలై రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అది థియేటర్ లో విడుదల కాలేదు. నేను నా విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని అమ్మవలసి వచ్చినందుకు నాకు ఇబ్బంది లేదు. కానీ నా కుటుంబం దృష్టిలో కంపెనీని అమ్మడం తప్పు. వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో తెలియకపోతే దాన్నుంచి తప్పుకోవడమే మార్గం అని నేను అనుకున్నాను. ఈ గొడవ మా ఇంట్లో నెల రోజులు నడిచింది. నేను, నాన్న మాట్లాడుకోవడం కూడా మానేశాం. కానీ, ఆ సమయంలో నాకు దొరికింది అదొక్కటే దారి. ఆ సమయంలో నాకు ఐఐఎం అహ్మదాబాద్లో మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేస్తున్న ఒక స్నేహితుడు ఉన్నాడు. అతనితో కంపెనీ గురించి రెండు వారాలు మాట్లాడి.. తిరిగివచ్చి కంపెనీని అమ్మేశాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!