Ramoji Rao: నిర్మాతగా ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన రామోజీరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramoji Rao Died without fulfilling his goal as Producer: ఈనాడు సంస్థల అధినేతగా అందరికీ సుపరిచితులు అయిన రామోజీరావు ఫిలిం సిటీ నిర్మించడమే కాదు అనేక సినిమాలను నిర్మించారు కూడా. ఉషాకిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేసిన అఆయన ఎన్నో మరపురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. హృద్యమైన కథలకు ఆ సంస్థ పెట్టింది పేరు అనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ లేకున్నా యువ దర్శకులకూ, నటీనటులకు అవకాశాలిచ్చి, వారి ప్రతిభను బయటకు తీసుకొచ్చి ఎందరినో తెలుగు సినీ పరిశ్రమకు అందించింది. ఈ సంస్థ చివరిగా దాగుడు మూతలు దండాకోరు అనే సినిమా చేసింది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమా వచ్చి పోయినట్టు కూడా చాలా మందికి తెలియదు.
Big Breaking: Ramoji Rao : రామోజీ రావు కన్నుమూత!!
Also Read
- Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్రూమ్ వార్ అదిరింది
- Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
- Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
- Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
ఆ తరువాత నుంచి ఉషాకిరణ్ నుంచి సినిమాలు రావడం లేదు. మిగిలిన వ్యాపారాల్లో కనిపించే `లాభం` సినిమాల్లో లేకపోయేసరికి మెల్లమెల్లగా సినీ నిర్మాణం తగ్గించుకుందనే అప్పట్లో టాక్ నడిచింది. అయితే కరోనాకి ముందు అంటే 2019 సమయంలో మళ్లీ ఉషాకిరణ్ మూవీస్ యాక్టీవ్ అయ్యేందుకు యత్నించింది. అందుకు ఉషాకిరణ్ మూవీస్ సంస్థ కొన్ని కథలు కుడా సిద్ధం చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఉషాకిరణ్ దాదాపు 85 సినిమాల్ని రూపొందించింది. మరో 15 తీస్తే వంద సినిమాలు తెరకెక్కించిన ఘనత దక్కుతుందని భావించి ఆ మైలు రాయి కోసమైనా సినిమాలు చేయాలని రామోజీరావు అప్పట్లో భావించారు. అయితే అలాగని ఏ కథలు పడితే, ఆ కథల్ని ఎంచుకోకుండా, ఉషాకిరణ్ గత వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా సినిమాల్ని రూపొందించాలని అనుకున్నారు.
అప్పట్లోనే ఉషాకిరణ్ సంస్థ దగ్గర కొన్ని కథలు సిద్ధమయ్యాయి కూడా. ఆ కథల్ని యువతరం దర్శకులతో తెరకెక్కించడానికి సన్నాహాలు కూడా చేశారు. 2016-17 తరువాత తొలి సినిమాతోనే హిట్టు కొట్టిన కొంతమంది దర్శకులకు ఉషాకిరణ్ మూవీస్ నుంచి పిలుపొచ్చింది. కొంతమందికి అడ్వాన్సులూ అందాయి, ఈ సినిమాలకు రామోజీ రావు నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందని కూడా అన్నారు. అయితే కరోనా ఎంట్రీతో అన్ని పరిస్థితులు మారిపోయాయి. అనుకున్న సినిమాలు ఆగిపోయాయి. కరోనా తరువాత తెలుగు ప్రేక్షకులు సినిమాల విషయంలో మనసు మార్చుకున్న తీరు వల్లనో ఏమో కానీ తెరకెక్కించాలి అనుకున్న సినిమాలను కూడా పక్కన పెట్టేశారు. అలా 100 సినిమాలు చేయాలనుకున్న రామోజీరావు నిర్మాతగా ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు.
తాజావార్తలు
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్రూమ్ వార్ అదిరింది
-
Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
-
India External Debt 2026: 762.8 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత విదేశీ రుణం..
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!