Ram Gopal Varma: ఏపీ రాజకీయాల నేపథ్యంలో వర్మ రెండు సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma: రాయలసీమ పగ, ప్రతీకారాల నేపథ్యంలో ‘రక్త చరిత్ర’ను రెండు భాగాలుగా తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్లో రెండు సినిమాలు తీయబోతున్నారు. అయితే.. కొనసాగింపుగా ఉండే ఈ సినిమాలకు రెండు పేర్లను పెట్టారు వర్మ. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను వర్మ కలిసుకున్నారని, ఆ తర్వాత జగన్ బయోగ్రఫీని వర్మ తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. వాటిని ఖండిస్తూ, తాను తీయబోతోంది బయోపిక్ కాదని, దాన్ని మించిన రియల్ పిక్ అని వర్మ చెబుతున్నాడు. బయోపిక్ లో అయినా అబద్ధాలు ఉండొచ్చు కానీ తాను తీసే రియల్ పిక్ లో నూటికి నూరుపాళ్ళు నిజం ఉంటుందని అంటున్నాడు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ‘వ్యూహం’ కథ రూపుదిద్దుకుందని, ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని వర్మ అన్నాడు. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికారమే ‘వ్యూహం’ చిత్రం అని వర్మ తెలిపాడు. దీనికి కొనసాగింపుగా ‘శపథం’ అనే మరో సినిమా కూడా తీస్తున్నానని, ‘వ్యూహం’ షాక్ నుండి జనం తేరుకునే లోపే మరో ఎలక్ట్రిక్ షాక్ మాదిరి ‘శపథం’ను విడుదల చేస్తామని చెప్పాడు.
Read Also: Gudivada Amarnath : రెచ్చగొట్టేలా ఏ పనీ చేయద్దని మేం అంటున్నాం
Also Read
ఇది అందరూ అనుకుంటున్నట్టు ఎలక్షన్స్ ను టార్గెట్ చేసి తీస్తున్న సినిమా కదాని వర్మ స్పష్టం చేశాడు. తాను అలా అన్నా… ఎవరూ నమ్మరు కాబట్టి ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం తనకు లేదని తనదైన తరహాలో ప్రకటించాడు. గతంలో వర్మ తో ‘వంగవీటి’ సినిమాను తీసిన దాసరి కిరణ్ ‘వ్యూహం’, ‘శపథం’ చిత్రాలను నిర్మించబోతున్నారు. ఇందులో తొలి భాగం వై. యస్. రాజశేఖర్ రెడ్డి రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటుండగా, రెండో భాగం ‘శపథం’లో ఆయన మరణానంతరం జగన్ ఎలా ముఖ్యమంత్రి అయ్యిండనేది ప్రధానాంశమని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
-
Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Fact Check: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!