Ram Gopal Varma: ఏపీ రాజకీయాల నేపథ్యంలో వర్మ రెండు సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma: రాయలసీమ పగ, ప్రతీకారాల నేపథ్యంలో ‘రక్త చరిత్ర’ను రెండు భాగాలుగా తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్లో రెండు సినిమాలు తీయబోతున్నారు. అయితే.. కొనసాగింపుగా ఉండే ఈ సినిమాలకు రెండు పేర్లను పెట్టారు వర్మ. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను వర్మ కలిసుకున్నారని, ఆ తర్వాత జగన్ బయోగ్రఫీని వర్మ తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. వాటిని ఖండిస్తూ, తాను తీయబోతోంది బయోపిక్ కాదని, దాన్ని మించిన రియల్ పిక్ అని వర్మ చెబుతున్నాడు. బయోపిక్ లో అయినా అబద్ధాలు ఉండొచ్చు కానీ తాను తీసే రియల్ పిక్ లో నూటికి నూరుపాళ్ళు నిజం ఉంటుందని అంటున్నాడు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ‘వ్యూహం’ కథ రూపుదిద్దుకుందని, ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని వర్మ అన్నాడు. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికారమే ‘వ్యూహం’ చిత్రం అని వర్మ తెలిపాడు. దీనికి కొనసాగింపుగా ‘శపథం’ అనే మరో సినిమా కూడా తీస్తున్నానని, ‘వ్యూహం’ షాక్ నుండి జనం తేరుకునే లోపే మరో ఎలక్ట్రిక్ షాక్ మాదిరి ‘శపథం’ను విడుదల చేస్తామని చెప్పాడు.
Read Also: Gudivada Amarnath : రెచ్చగొట్టేలా ఏ పనీ చేయద్దని మేం అంటున్నాం
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ఇది అందరూ అనుకుంటున్నట్టు ఎలక్షన్స్ ను టార్గెట్ చేసి తీస్తున్న సినిమా కదాని వర్మ స్పష్టం చేశాడు. తాను అలా అన్నా… ఎవరూ నమ్మరు కాబట్టి ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం తనకు లేదని తనదైన తరహాలో ప్రకటించాడు. గతంలో వర్మ తో ‘వంగవీటి’ సినిమాను తీసిన దాసరి కిరణ్ ‘వ్యూహం’, ‘శపథం’ చిత్రాలను నిర్మించబోతున్నారు. ఇందులో తొలి భాగం వై. యస్. రాజశేఖర్ రెడ్డి రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటుండగా, రెండో భాగం ‘శపథం’లో ఆయన మరణానంతరం జగన్ ఎలా ముఖ్యమంత్రి అయ్యిండనేది ప్రధానాంశమని తెలుస్తోంది.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!