ఆర్ఆర్ఆర్ : హైదరాబాద్ తిరిగొచ్చిన చరణ్… ఉక్రెయిన్ షూటింగ్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ విమానాశ్రయంలో కన్పించాడు. ఆ పిక్స్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” చివరి షెడ్యూల్ ని ఉక్రెయిన్ లో ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఈ రోజు ఉదయం ఆయన ఎయిర్ పోర్టులో కంపించడంతో కెమెరాలు క్లిక్ అన్నాయి. చరణ్ బ్లాక్ హూడీ, బ్లాక్ జీన్స్ ధరించి, మ్యాచింగ్ మాస్క్, టోపీ ధరించాడు. అయినప్పటికీ అభిమానులు ఆయనను గుర్తు పట్టేశారు. మిగతా “ఆర్ఆర్ఆర్” టీం కూడా హైదరాబాద్ కు చేరుకున్నట్టు సమాచార. ఎన్టీఆర్ నిన్ననే హైదరాబాద్ వచ్చాడు.
తారక్, చరణ్తో సహా ప్రధాన తారాగణంపై పాట చిత్రీకరణను పూర్తి చేయడానికి “ఆర్ఆర్ఆర్” బృందం ఉక్రెయిన్కు వెళ్లిన విషయం తెలిసిందే. బ్రిటిష్ పాలకుల రాయల్ బ్యాలెట్ ప్రదర్శనను అందించే కీలక సమయంలో ఈ సాంగ్ ఉంటుందని అంటున్నారు. బజ్ ప్రకారం ఈ పాట తర్వాత సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ ఉంటుంది. దర్శకుడు రాజమౌళి అండ్ టీమ్ ఉక్రెయిన్లో 10 రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుని మొత్తానికి హైదరాబాద్లో అడుగుపెట్టారు. సినిమా పూర్తయిన సందర్భంగా రాజమౌళి అండ్ టీం కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. “ఆర్ఆర్ఆర్” బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయడానికి రాజమౌళి కొత్త షెడ్యూల్ని ప్లాన్ చేస్తున్నాడు. త్వరలో చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించి, “ఆర్ఆర్ఆర్” రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తుందని అంటున్నారు.
Also Read
- NTR - Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
- Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న 'ఇడుపు కాయితం'.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
- Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
Read Also : ఆగష్టు 22న మెగా అప్డేట్… అంతా రాజమౌళి చేతుల్లోనే ?
2021 అక్టోబర్ 13న సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ, కేరళ, మహారాష్ట్ర మొదలైన కొన్ని రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు మెరుగుపడలేదు. దీంతో అక్కడ థియేటర్లు ఇంకా ఓపెన్ కాలేదు. ఈ సినిమా విడుదల కావడానికి అది కూడా ఒక కారణం. అయితే చెప్పినట్టుగానే సినిమాను విడుదల చేస్తారా ? లేదా ? అనేది మాత్రం ఇంకా సస్పెన్సుగానే ఉంది.
ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!