Peddi: రామ్ చరణ్ కోసం రంగంలోకి టీమ్ ఇండియా లెజెండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ప్రమోషన్లు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో లేవని మెగా అభిమానులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. అయితే, ఈ లోటును పూడ్చేందుకు చిత్ర యూనిట్ ఒక భారీ ‘మైండ్ బ్లాకింగ్’ ప్లాన్తో సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా క్రీడా నేపథ్యం (స్పోర్ట్స్ డ్రామా), ముఖ్యంగా క్రికెట్ బ్యాక్డ్రాప్లో సాగుతుండటంతో, ప్రమోషన్ల కోసం ఒక అరుదైన అతిథిని తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక భారీ ఈవెంట్ను నిర్వహించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ వేడుకకు భారత మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని చూస్తున్నట్టు గట్టిగా వినిపిస్తోంది. ధోనీ స్వస్థలం రాంచీ కావడం, అలాగే సినిమా క్రీడా నేపథ్యంలో ఉండటంతో ఆయన రాక సినిమాకు భారీ హైప్ తీసుకొస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ప్రస్తుతానికి ధోనీతో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఇంకా ఏదీ అధికారికంగా ఖరారు కాలేదని తెలుస్తోంది. ఒకవేళ ధోనీ ఈ ఈవెంట్కు హాజరైతే మాత్రం, నార్త్ ఇండియా మార్కెట్లో ‘పెద్ది’ సినిమాకు తిరుగులేని ప్రచారం లభిస్తుందని చెప్పొచ్చు. రామ్ చరణ్ మాస్ ఇమేజ్, ధోనీ క్రేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం.
Also Read
- Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. 'కల్కి 2' రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?
- Rowdy Janardhana: విజయ్ బర్త్డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
- Ameesha Patel: పీఆర్ టీమ్స్కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!
- Kiran Abbavaram: ఫ్లాప్ ఇచ్చినా తగ్గేదేలే.. రిస్క్ అని తెలిసినా డైరెక్షన్ వైపు అబ్బవరం..
తాజావార్తలు
-
Peddi: రామ్ చరణ్ కోసం రంగంలోకి టీమ్ ఇండియా లెజెండ్..
-
Railway Recruitment 2026: రైల్వేలో 1,644 ఉద్యోగాలు.. టెన్త్ పాస్ అయితే చాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక
-
PM Modi: “సిలిగురి సింహం”.. ప్రధాని మోడీ స్వయంగా కాళ్లు మొక్కిన ఆ ‘పెద్దాయన’ ఎవరో తెలుసా?
-
Rohit Sharma TV Show: రెండు లైన్లకే ఇంత వైరల్ అయితే.. మొత్తం షో రిలీజ్ అయితే ఇంకెంత రచ్చ అవుతుందో!
-
Suvendu Adhikari: “సువేందు అధికారి అనే నేను”.. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!