మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పాపులర్ డైరెక్టర్ శంకర్ కాంబోలో RC15 అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, చెర్రీ మొదటిసారిగా తండ్రీకొడుకులుగా కన్పించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం సంగతి అలా ఉంచితే… ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్ అమృత్ సర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 6 నుంచే అక్కడ షూటింగ్ జరుగుతుండగా, తాజాగా సెట్స్ లో నుంచి చెర్రీ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ భారీ సంఖ్యలో అభిమానులు చెర్రీతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు.
Read Also : Akhil Akkineni : వైజాగ్ లో “ఏజెంట్”కు గ్రాండ్ వెల్కమ్
ఇక ఈ తాజా షెడ్యూల్ లో హీరోయిన్ కియారా అద్వానీ కూడా పాల్గొంటోంది. మరో రెండు వారాలకు పైగా అమృత్ సర్ లోనే షూటింగ్ జరగనుందని సమాచారం. అక్కడ హీరోహీరోయిన్లపై కళాశాల సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ అమృత్సర్లోని ఒక విశ్వవిద్యాలయంలో జరుగుతోంది. మే ప్రారంభంలో విశాఖపట్నంలో నెక్స్ట్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ‘RC15’ చిత్రంలో నవీన్ చంద్ర, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కూడా కనిపించబోతున్నారు. సునీల్, మలయాళ నటుడు జయరామ్, తమిళ దర్శకుడు ఎస్జే సూర్య ఇతర కీలక పాత్రలు పోషించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా రానుంది.