NTV Telugu Site icon

Rajinikanth: ‘వీరసింహారెడ్డి’ని మెచ్చిన తలైవా.. అది బాలయ్య

Rajini

Rajini

Rajinikanth: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం, థమన్ మ్యూజిక్, శృతి, హనీ రోజ్ అందాలు అన్నింటికీ మించి ఒక బాలయ్య అభిమానిగా గోపీచంద్ మలినేని టేకింగ్.. ఈ సినిమాను విజయం వైపు తీసుకెళ్లాయి. ఇప్పటికి విజయవంతంగా ఈ సినిమా కొనసాగుతూ రికార్డ్ కలక్షన్స్ ను రాబడుతోంది. అభిమానులే కాకుండా ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించి తమదైన శైలిలో రివ్యూలు ఇస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించారు. సినిమా చూసిన అనంతరం డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఈ విషయాన్ని స్వయంగా గోపీచంద్ మలినేని ట్వీట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

Venkatesh: ఒక్క హిట్ తో వచ్చిన అవకాశం.. ఒక్క ప్లాప్ తో పాయే..?

” ఇది నాకు నమ్మలేని ఒక క్షణం.. తలైవర్, సూపర్ స్టార్ రజినీకాంత్ సార్ నుండి కాల్ వచ్చింది. ఆయన వీరసింహారెడ్డి సినిమాను చూసి నాకు కాల్ చేసి.. సినిమా చాలా బావుందని మెచ్చుకున్నారు. నా సినిమా గురించి ఆయన ప్రశంసించడం, ఆయన భావోద్వేగం
నాకు ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ. థాంక్యూ రజనీ సార్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. రజినీ, నందమూరి బాలకృష్ణ కు కూడా కాల్ చేసి ఉండొచ్చు.. కానీ, బాలయ్య, తారకరత్న హెల్త్ విషయంలో అప్సెట్ గా ఉండడంతో ఆయన ఈ విషయాన్ని షేర్ చేసుకోలేకపోవచ్చని, ఏది ఏమైనా బాలయ్య సినిమాను రజినీ మెచ్చుకోవడంతో అది బాలయ్య అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.