తెలుగు తెరపై ఒకప్పుడు హోమ్లీ లుక్స్తో, క్యూట్ యాక్టింగ్తో కుర్రకారు మనసు దోచుకున్న భామ రాశి ఖన్నా, ఇటీవల సోషల్ మీడియా వేదికగా విపరీతమైన గ్లామర్ అటాక్ చేస్తోంది. వారం తిరగకుండానే మరోసారి ఇన్స్టాగ్రామ్ను హీట్ ఎక్కిస్తూ ఆమె షేర్ చేసిన తాజా ఫోటోషూట్ పిక్స్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
నల్లటి డిజైనర్ ఇన్నర్, బ్లాక్ లెదర్ జాకెట్ అలానే బ్లూ డెనిమ్ జీన్స్లో రాశి ఖన్నా పోజ్ ఇచ్చిన తీరు, ఆమె ఇచ్చిన క్లీవేజ్ పోజులు అభిమానులను ఒక్కసారిగా షాక్కు గురిచేస్తున్నాయి. అత్యంత బోల్డ్ అవతారంలో మెరుస్తూ తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలీవుడ్లో ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ సుందరికి, ప్రస్తుతం తెలుగులో అవకాశాలు బాగా తగ్గిపోయాయనేది ఫిల్మ్ నగర్ టాక్. గ్లామర్ పాత్రలు చేయడానికి తాను ఏమాత్రం వెనుకాడనని, ఎలాంటి బోల్డ్ రోల్స్కైనా సిద్ధమేనని దర్శకులకు, నిర్మాతలకు సిగ్నల్స్ ఇవ్వడానికే రాశి ఈ స్థాయిలో గ్లామర్ డోస్ పెంచేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హీరోయిన్గా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న రాశి ఖన్నా, తన గ్లామర్ పిక్స్తో దర్శక నిర్మాతలను ఆకట్టుకుని మళ్లీ టాలీవుడ్ లో బిజీ కావాలని గట్టిగా ట్రై చేస్తోంది. మరి ఈ హాట్ ఫోటోషూట్ ఆమెకు టాలీవుడ్లో సరికొత్త ఆఫర్లను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి!

