కోమలి సినిమాతో దర్శకుడిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారడు రంగనాధ్. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ ‘లవ్ టుడే’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ యూత్ లో తిరుగులేని క్రేజ్ ను సంపాదించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు ప్రదీప్ ఇటీవల ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి బ్లాక్ బస్టర్ హాట్ కొట్టడమే కాకుండా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టింది.
Also Read : Kollywood : సీక్వెల్స్ కింగ్ గా మారిన యంగ్ హీరో
ప్రదీప్ ప్రస్తుతం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపేని’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార భర్త అయిన విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ధీమా.. ధీమా.. సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 18న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపేని’ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది ఇప్పటికే డ్రాగన్ ను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ప్రదీప్. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఈ రెండు కాకుండా ఇటీవల మైత్రి తో ప్రదీప్ చేయబోతున్న డ్యూడ్ కూడా ఈ ఏడాది దీపావళి కనుకగా రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు. ఇలా ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో కోలీవుడ్ లో రచ్చ చేసున్నాడు ప్రదీప్. అనిరుధ్ సంగీతం అందిస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపేని సినిమాను నయనతార, సెవెన్ స్క్రీన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.