Site icon NTV Telugu

ఇప్పుడు దీపికా వంతు… డార్లింగ్ అదిరిపోయే ఆంధ్రా విందు

Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడన్న విషయం తెలిసిందే. ఆయన తినడమే కాకుండా తన సినిమాల్లో నటించే హీరోయిన్లకు నటీనటులకు కూడా ఆంధ్రా వంటకాలతో అద్భుతమైన ట్రీట్ ఇప్పిస్తారు. ఈ విషయాన్నీ ఇప్పటికే ఆయనతో కలిసి పని చేసిన చాలామంది హీరోయిన్లు వెల్లడించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె వంతు వచ్చింది.

Read Also : ‘ఊ అంటావా’ సాంగ్ పై చంద్రబోస్ కామెంట్స్… దేవిశ్రీ కొత్త రికార్డు

ప్రభాస్, దీపికా జంటగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ పాన్ ఇండియా చిత్రం “ప్రాజెక్ట్ కే” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘ప్రాజెక్ట్ కే’లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే దీపికా హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ముందుగా సినిమా షూటింగ్ ను దీపికా స్టార్ట్ చేయగా, తరువాత ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ మొదటి షెడ్యూల్‌ను దీపికా పూర్తి చేసింది. షూటింగ్ చివరిలోప్రభాస్ దీపికా పదుకొనె కోసం అద్భుతమైన విందును ఏర్పాటు చేశాడట. ఈ మేరకు దీపికా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పిక్ వైరల్ అవుతోంది. ఆ పిక్ లో కొన్ని రుచికరమైన సౌత్ కూరలు, నోరూరించే బిర్యానీ, కబాబ్‌లు, ఇతర రుచికరమైన వంటకాలు ఉన్నాయి.

Exit mobile version