సినీనటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడని ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నాయకుడు జోగినేని మణి ఈ నెల 24న పోసాని కృష్ణమురళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో పోసానిపై 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే 26న పోసానిని హైదరాబాద్లో ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను ఓబులవారిపల్లె పోలీస్స్టేషన్కు తరలించారు.
కాగా పోసాని అరెస్ట్ అక్రమం బీఎన్ఎస్ చట్టం ప్రకారం పోసాని కృష్ణమురళికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పోసాని తరపు న్యాయవాది పొన్నవోలు కోర్టును కోరారు. గురువారం రాత్రి 9 గంటల నుంచి శుక్రవారం తెల్లవారు జామున 5 గంటల వరకు దాదాపు 7 గంటలుగా ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరువురి వాదనల అనంతరం పోసానికి 14 రోజుల రిమాండ్విధిస్తు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ రోజు నుండి మార్చి 12 వరకు పోసాని రిమాండ్లో ఉండనున్నారు. పోసాని కృష్ణమురళిని రాజంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.