Modi – Trump: ప్రపంచ దేశాల కళ్లు ఫ్రాన్స్పైనే.. జీ7 సదస్సులో చేతులు కలిపిన మోడీ – ట్రంప్! వాషింగ్టన్ టు ఢిల్లీ నయా జోష్..
- 16 నెలల తర్వాత మోడీ - ట్రంప్ క్రేజీ షేక్హ్యాండ్
- ఇద్దరు గ్లోబల్ లీడర్స్ భేటీ..
- వరల్డ్ పాలిటిక్స్లో నయా జోష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi – Trump: ప్రపంచ దేశాల కళ్లన్నీ ఇప్పుడు ఫ్రాన్స్పైనే ఉన్నాయి. అక్కడ జరుగుతున్న జీ7 (G7) సదస్సులో ఒక అరుదైన, అత్యంత ప్రాధాన్యత కలిగిన దృశ్యం ఆవిష్కృతమైంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ – అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరస్పరం ఎంతో ఆత్మీయంగా కరచాలనం చేసుకున్నారు. ఇరు దేశాల అగ్రనేతలు ముఖాముఖిగా కలుసుకోవడం గత 16 నెలల్లో ఇదే తొలిసారి కావడం విశేషం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యారు. లీడర్స్ అందరూ ఒకచోట గుమిగూడిన సమయంలో.. ప్రధాని మోడీ చిరునవ్వుతో ట్రంప్కు అభినందనలు తెలుపుతూ చేతులు కలిపారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు ఇతర ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జీ7లో భారత్ సరికొత్త రికార్డ్
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొత్తలో.. అంటే 2025 ఫిబ్రవరిలో ప్రధాని మోడీ వాషింగ్టన్ పర్యటనకు వెళ్లారు. అప్పట్లో వీరిద్దరూ ముఖాముఖిగా భేటీ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు (16 నెలల తర్వాత) వీరిద్దరూ నేరుగా కలుసుకోవడం ఇదే మొదటిసారి. అంతకుముందు సదస్సు ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్వయంగా ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ ఎవియన్ నగరానికి చేరుకున్నారు. జీ7 సదస్సులో భార ప్రధాని పాల్గొనడం ఇది వరుసగా ఏడోసారి కావడం గమనార్హం. జీ7 గ్రూపులో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేనప్పటికీ.. అంతర్జాతీయ చర్చల్లో, ప్రపంచ నిర్ణయాలలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రకు ఈ వరుస ఆహ్వానాలే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వేదిక ద్వారా భారత్ ముఖ్యంగా ‘గ్లోబల్ సౌత్’ (అభివృద్ధి చెందుతున్న దేశాల) సమస్యలను, వారి గళాన్ని ప్రపంచం ముందు ఉంచబోతోంది.
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
సదస్సు ప్రధాన అజెండా ఇదే..
ఈసారి జరుగుతున్న జీ7 సదస్సులో ప్రపంచాన్ని ప్రభావితం చేసే పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వం (Global Economic Stability), ఇంధన భద్రత (Energy Security), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత, ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం)లలో సాగుతున్న సుదీర్ఘ యుద్ధాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలే ప్రధాన అజెండాగా ఈ సదస్సు జరుగుతుందని సమాచారం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎదురవుతున్న సవాళ్లపై పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఈ వేదిక ద్వారా న్యూఢిల్లీ గట్టిగా నొక్కి చెప్పనుంది.
తాజావార్తలు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?