Modi – Trump: ప్రపంచ దేశాల కళ్లు ఫ్రాన్స్పైనే.. జీ7 సదస్సులో చేతులు కలిపిన మోడీ – ట్రంప్! వాషింగ్టన్ టు ఢిల్లీ నయా జోష్..
- 16 నెలల తర్వాత మోడీ - ట్రంప్ క్రేజీ షేక్హ్యాండ్
- ఇద్దరు గ్లోబల్ లీడర్స్ భేటీ..
- వరల్డ్ పాలిటిక్స్లో నయా జోష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi – Trump: ప్రపంచ దేశాల కళ్లన్నీ ఇప్పుడు ఫ్రాన్స్పైనే ఉన్నాయి. అక్కడ జరుగుతున్న జీ7 (G7) సదస్సులో ఒక అరుదైన, అత్యంత ప్రాధాన్యత కలిగిన దృశ్యం ఆవిష్కృతమైంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ – అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరస్పరం ఎంతో ఆత్మీయంగా కరచాలనం చేసుకున్నారు. ఇరు దేశాల అగ్రనేతలు ముఖాముఖిగా కలుసుకోవడం గత 16 నెలల్లో ఇదే తొలిసారి కావడం విశేషం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యారు. లీడర్స్ అందరూ ఒకచోట గుమిగూడిన సమయంలో.. ప్రధాని మోడీ చిరునవ్వుతో ట్రంప్కు అభినందనలు తెలుపుతూ చేతులు కలిపారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు ఇతర ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జీ7లో భారత్ సరికొత్త రికార్డ్
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొత్తలో.. అంటే 2025 ఫిబ్రవరిలో ప్రధాని మోడీ వాషింగ్టన్ పర్యటనకు వెళ్లారు. అప్పట్లో వీరిద్దరూ ముఖాముఖిగా భేటీ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు (16 నెలల తర్వాత) వీరిద్దరూ నేరుగా కలుసుకోవడం ఇదే మొదటిసారి. అంతకుముందు సదస్సు ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్వయంగా ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ ఎవియన్ నగరానికి చేరుకున్నారు. జీ7 సదస్సులో భార ప్రధాని పాల్గొనడం ఇది వరుసగా ఏడోసారి కావడం గమనార్హం. జీ7 గ్రూపులో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేనప్పటికీ.. అంతర్జాతీయ చర్చల్లో, ప్రపంచ నిర్ణయాలలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రకు ఈ వరుస ఆహ్వానాలే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వేదిక ద్వారా భారత్ ముఖ్యంగా ‘గ్లోబల్ సౌత్’ (అభివృద్ధి చెందుతున్న దేశాల) సమస్యలను, వారి గళాన్ని ప్రపంచం ముందు ఉంచబోతోంది.
Also Read
- OG 2 Update : పవర్ స్టార్ 'OG -2' స్పెషల్ గ్లింప్స్ రిలీజ్కు డేట్ ఫిక్స్
- Sing Geetham OTT Release : ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసిన 'సింగ్ గీతం'
- Ravi Teja and Sree Vishnu: రవితేజ, శ్రీ విష్ణు మల్టీస్టారర్కు 'వీరాధి వీరులంట' టైటిల్?.. సంక్రాంతి టార్గెట్తో క్రేజీ బజ్
- NTR Neel : 'డ్రాగన్' ఇంటర్వెల్ ఎపిసోడ్.. నెవర్ బిఫోర్ ఇన్ టాలీవుడ్
సదస్సు ప్రధాన అజెండా ఇదే..
ఈసారి జరుగుతున్న జీ7 సదస్సులో ప్రపంచాన్ని ప్రభావితం చేసే పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వం (Global Economic Stability), ఇంధన భద్రత (Energy Security), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత, ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం)లలో సాగుతున్న సుదీర్ఘ యుద్ధాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలే ప్రధాన అజెండాగా ఈ సదస్సు జరుగుతుందని సమాచారం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎదురవుతున్న సవాళ్లపై పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఈ వేదిక ద్వారా న్యూఢిల్లీ గట్టిగా నొక్కి చెప్పనుంది.
తాజావార్తలు
-
OG 2 Update : పవర్ స్టార్ ‘OG -2’ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్కు డేట్ ఫిక్స్
-
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో ఒకే రన్వేపై రెండు విమానాలు.. వందలాది మంది ప్రయాణికులు చావు అంచుల వరకు..
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Beware Bachelors: పెళ్లి కావాల్సిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన వార్త! అందాల ఎర వేసి కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
-
India Unwanted Record: ఇంగ్లండ్ ధాటికి చిత్తైన భారత్.. చరిత్రలో తొలిసారి చెత్త రికార్డు
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!