ఇండస్ట్రీలో విషాదం… ప్రముఖ గాయకుడు, నటుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ తమిళ నేపథ్య గాయకుడు, నటుడు మాణిక్క వినాయగం అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. సమాచారం ప్రకారం సోమవారం అడయార్లోని వినాయగం నివాసంలో గాయకుడికి అంత్యక్రియలు చేస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలుస్తోంది. విషయం తెలిసిన పలువురు సెలెబ్రిటీలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. వినాయగం ‘నాట్యాచార్య పద్మశ్రీ’ వజువూరు బి. రామయ్య పిళ్లై చిన్న కుమారుడు. వినాయకం తమిళంతో పాటు ఇతర దక్షిణ భారత భాషలలో 800 కంటే ఎక్కువ పాటలు పాడారు. అనేక చిత్రాలలో కూడా నటించారు.
ఆయన విక్రమ్ నటించిన ‘ధిల్’ (2001)లో ‘కన్నుకుల్లా కెలుతి’ పాటతో నేపథ్య గానంలోకి అడుగుపెట్టాడు. విదై కొడు ఎంగల్ నాదే – కన్నతిల్ ముత్తమిట్టల్ (2002), కొడువ మీసై – ధూల్ (2003) వంటి అనేక తమిళ బ్లాక్ బస్టర్ సాంగ్స్ పాడారు. సినిమాలకు పాడడమే కాకుండా వందలాది జానపద గీతాలు, భక్తిగీతాలు పాడారు. ఇక వినాయగం అతను ‘తిరుడ తిరుడి’ (2003) చిత్రంలో ధనుష్ తండ్రి పాత్రను పోషించాడు. ఇంకా గంభీరం, పెరళగన్ అరివుమణి వంటి పలు సినిమాలలో కూడా నటించాడు. తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
Also Read
తాజావార్తలు
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..