పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి బ్లాక్ బస్టర్ మలయాళ యాక్షన్ డ్రామా “అయ్యప్పనుమ్ కోషియుమ్” అధికారిక రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. స్టార్ కంపోజర్ థమన్ ఇప్పటికే రికార్డింగ్ పూర్తి చేసారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఆగష్టు 15న పవర్ స్టార్మ్ రాబోతోందని, సిద్ధంగా ఉండాలని తెలిపారు.
Read Also : ట్రెండింగ్ లో “బాయ్ కాట్ రాధికా ఆప్టే”
పవన్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను పోస్ట్ చేస్తూ ఆగష్టు 15న ఉదయం 9.45 గంటలకు సినిమా టైటిల్ తో పాటు, ఫస్ట్ గ్లింప్సె ఉంటుందని వెల్లడించారు. ఆగష్టు 15కు ఇంకా రెండ్రోజులే మిగిలి ఉంది. ఇది నిజంగా మెగా ఫ్యాన్స్ ఎగిరి గంతేసే అప్డేట్ అని చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పిక్స్, వీడియోలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. మరి ఫస్ట్ గ్లింప్సె విడుదలైన ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక కొన్ని రోజుల క్రితం నిత్యామీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోందని, ఆమె పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది అని ప్రకటించారు. ఈ యాక్షన్ డ్రామాలో రానా దగ్గుబాటి సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి సినిమాలో నుంచి మొదటి పాటను సెప్టెంబర్ 2 న విడుదల చేయబోతున్నారు.