Pallavi prashanth: నా మీద కేసులు పెడితే పెట్టుకోనీ.. పల్లవి ప్రశాంత్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pallavi prashanth Responds about Cases Registerd on him: బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్పై పలు కేసులు నమోదయ్యాయి. బిగ్ బాస్ తెలుగు 7 ఫినాలే ఆదివారం రాత్రి ముగిసింది. ‘రైతు బిడ్డ’ (రైతు కొడుకు) అని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ పోటీలో విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచాడు, కానీ ఆ తర్వాత, ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పల్లవి ప్రశాంత్పై పలు కేసులు నమోదయ్యాయి. ఇతర బిగ్ బాస్ పోటీదారులైన అమర్దీప్ మరియు అశ్విని శ్రీ వంటి వారి కార్లను అతని ఫాన్స్ గా చెబుతున్న వారు ధ్వంసం చేశారు. అలాగే అమర్దీప్, ప్రశాంత్ ఫాన్స్ ఘర్షణకు దిగారు. ఈ దుర్మార్గులు కొన్ని ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. ఇక విజేతగా నిలిచిన ప్రశాంత్ను పోలీసులు తొలుత ఇంటికి పంపించారు. అయినప్పటికీ, అతను తన మద్దతుదారులతో అన్నపూర్ణ స్టూడియోస్కు తిరిగి వచ్చాడు.
Tollywood : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన సినీ పెద్దలు
Also Read
- Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
- Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
- Oscars Academy :'RRR' ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
ఈ క్రమంలో నిబంధనలు పాటించకుండా, చట్ట వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడం వల్ల చాలా సమస్యలు తలెత్తడంతో పోలీసు అధికారులు అతనిపై చాలా సీరియస్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. 147, 148, 290, 353, 426, మరియు 149 సెక్షన్ల కింద ప్రశాంత్, అతని అనుచరులపై కూడా కేసులు పెట్టారు. ఇక ఈ క్రమంలో ఈ కేసుల గురించి ప్రశించగా దానికి ప్రశాంత్ స్పందిస్తూ అక్కడ ఎంత మంది వచ్చారో నాకు తెలియదు, నన్నే చాలా సేపు ఉంచి బ్యాక్ గేట్ నుంచి పంపితే నేను చాలా సేపు ఉండి మళ్ళీ వచ్చా. అప్పుడు పోలీసులు మా వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేశారు. మా వాళ్ళు ఎవరూ ఏమీ ద్వంశం చేయలేదు, నన్నే వెనుక డోర్ నుంచి పంపారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదని అక్కడి టీమ్ నాకు చెప్పిందని అన్నారు. ఇక కేసులు సంగతి తెలుసా అని అడిగితే నామీద పెడితే పెట్టుకోనీ నేనేమైనా చేస్తే కదా నా మీద పెట్టనీకి అని ప్రశ్నించారు. ఒకడు పండించిన పంట ఎండిపోతే వాడు బాధ పడతాడు కానీ ఎవడిమీదో వేస్తానంటే ఎలా అని ప్రశాంత్ ప్రశ్నిస్తున్నాడు.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!