భారత్ నుండి ఆస్కార్ కోసం పోటీ పడిన 14 చిత్రాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే యేడాది జరుగబోతున్న ఆస్కార్ అవార్డ్స్ లో ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరికి భారత్ నుండి తమిళ చిత్రం ‘కూళంగల్’ ఎంపికైంది. పి.ఎస్. వినోద్ రాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, నయనతారతో కలిసి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ ఎంట్రీ కోసం వివిధ భాషాల నుండి వచ్చిన సినిమాలను ఒడపోత పోసి మొత్తం 14 చిత్రాలను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ సినిమాలను ఈ నెల 18 నుండి 23 వరకూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 15 మంది జ్యూరీ సభ్యుల కమిటీ వీక్షించి, ‘కూళంగల్’ను భారతదేశం తరఫున ఆస్కార్ కు అధికారిక చిత్రంగా ఎంపిక చేసింది. ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు షాజీ ఎన్. కరుణ్ ఛైర్మన్ గా వ్యవహరించిన ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుండి ఇద్దరు ఫిల్మ్ జర్నలిస్టులకు చోటు దక్కడం విశేషం. ఫిల్మ్ జర్నలిస్ట్, ప్రొడ్యూసర్, రైటర్ కె. ఉమామహేశ్వరరావుతో పాటు మరో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ప్రొడ్యూసర్ జి. భగీరథ సైతం సెలక్షన్ కమిటీలో ఉన్నారు. ఆరు రోజుల పాటు కోల్ కత్తాలో ఈ 14 చిత్రాలను చూసి, ఏకాభిప్రాయంతో ‘కూళంగల్’ చిత్రాన్ని వీరు ఎంపిక చేశారు.
Read Also : ‘పెద్దన్న’ టీజర్ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్
Also Read
ఈసారి భారత్ నుండి ఆస్కార్ కు పోటీపడిన చిత్రాలతో ‘షేర్షా (హిందీ), మండేలా (తమిళం), షేర్నీ (హిందీ), ఆట వెల్ జాలీ (మరాఠీ), కూళంగల్ (తమిళం), కాగజ్ (హిందీ), బ్రిడ్జ్ (అస్సామి), తూఫాన్ (హిందీ), ఛల్లో షో (గుజరాతీ), గోదావరి (మరాఠీ), సర్దార్ ఉద్దమ్ (హిందీ), కార్ఖానిసాంచి వారి (మరాఠీ), నాయట్టు (మలయాళం), లైలా ఔర్ సాత్ గీత్ (గోర్జీ) చిత్రాలు ఉన్నాయి. చిత్రం ఏమంటే దేశంలోనే భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు అత్యధిక చిత్రాలను నిర్మించే తెలుగు చిత్రసీమ నుండి ఒక్క సినిమా కూడా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా ఈసారి తక్కువ చిత్రాలు వచ్చాయని, కానీ క్వాలిటీ సినిమాలను చూసి ఒడపోత పోయడానికి తాము ఎంతో మేథోమధనం చేయాల్సి వచ్చిందని కమిటీ ఛైర్మన్ షాజీ ఎన్ కరుణ్ తెలిపారు.

తాజావార్తలు
-
Warren Buffett: ఇకపై గేట్స్ ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వను.. సంచలన ప్రకటన చేసిన వారెన్ బఫెట్! కారణం ఇదేనా?
-
Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
-
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
-
Preity Mukhundhan: ఫైట్స్తో పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!