భారత్ నుండి ఆస్కార్ కోసం పోటీ పడిన 14 చిత్రాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే యేడాది జరుగబోతున్న ఆస్కార్ అవార్డ్స్ లో ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరికి భారత్ నుండి తమిళ చిత్రం ‘కూళంగల్’ ఎంపికైంది. పి.ఎస్. వినోద్ రాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, నయనతారతో కలిసి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ ఎంట్రీ కోసం వివిధ భాషాల నుండి వచ్చిన సినిమాలను ఒడపోత పోసి మొత్తం 14 చిత్రాలను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ సినిమాలను ఈ నెల 18 నుండి 23 వరకూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 15 మంది జ్యూరీ సభ్యుల కమిటీ వీక్షించి, ‘కూళంగల్’ను భారతదేశం తరఫున ఆస్కార్ కు అధికారిక చిత్రంగా ఎంపిక చేసింది. ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు షాజీ ఎన్. కరుణ్ ఛైర్మన్ గా వ్యవహరించిన ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుండి ఇద్దరు ఫిల్మ్ జర్నలిస్టులకు చోటు దక్కడం విశేషం. ఫిల్మ్ జర్నలిస్ట్, ప్రొడ్యూసర్, రైటర్ కె. ఉమామహేశ్వరరావుతో పాటు మరో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ప్రొడ్యూసర్ జి. భగీరథ సైతం సెలక్షన్ కమిటీలో ఉన్నారు. ఆరు రోజుల పాటు కోల్ కత్తాలో ఈ 14 చిత్రాలను చూసి, ఏకాభిప్రాయంతో ‘కూళంగల్’ చిత్రాన్ని వీరు ఎంపిక చేశారు.
Read Also : ‘పెద్దన్న’ టీజర్ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
ఈసారి భారత్ నుండి ఆస్కార్ కు పోటీపడిన చిత్రాలతో ‘షేర్షా (హిందీ), మండేలా (తమిళం), షేర్నీ (హిందీ), ఆట వెల్ జాలీ (మరాఠీ), కూళంగల్ (తమిళం), కాగజ్ (హిందీ), బ్రిడ్జ్ (అస్సామి), తూఫాన్ (హిందీ), ఛల్లో షో (గుజరాతీ), గోదావరి (మరాఠీ), సర్దార్ ఉద్దమ్ (హిందీ), కార్ఖానిసాంచి వారి (మరాఠీ), నాయట్టు (మలయాళం), లైలా ఔర్ సాత్ గీత్ (గోర్జీ) చిత్రాలు ఉన్నాయి. చిత్రం ఏమంటే దేశంలోనే భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు అత్యధిక చిత్రాలను నిర్మించే తెలుగు చిత్రసీమ నుండి ఒక్క సినిమా కూడా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా ఈసారి తక్కువ చిత్రాలు వచ్చాయని, కానీ క్వాలిటీ సినిమాలను చూసి ఒడపోత పోయడానికి తాము ఎంతో మేథోమధనం చేయాల్సి వచ్చిందని కమిటీ ఛైర్మన్ షాజీ ఎన్ కరుణ్ తెలిపారు.

తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!