Raid At Pudding & Mink Pub : రాత్రి నుంచి స్టేషన్ లోనే నిహారిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో ఇటీవల భారీగా డ్రగ్స్ కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో మరో భారీ రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేసి యజమానితో సహా 150 మందిని అరెస్టు చేశారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడం హాట్ టాపిక్గా మారింది. పబ్లో జరిగిన పార్టీలో వీరంతా డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన వారందరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున 3 గంటల వరకు పబ్ నిర్వహించిన పబ్ యజమానిని సైతం అదుపులోకి తీసుకున్నారు. కాగా విచారణ అనంతరం కొందరిని విడుదల చేయగా, ప్రస్తుతం 38 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే తమను అరెస్ట్ చేశారంటూ పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు పబ్ లో డ్రగ్స్ వాడినట్టు కూడా వెల్లడైంది.
Read Also : Galla Ashok : పబ్ వివాదంతో సంబంధం లేదు !
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
ఇదిలా ఉండగా ఈ వివాదంలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఉండడం సంచలనానికి దారి తీసింది. పుడ్డింగ్ అండ్ మింగ్ పబ్ లో రాత్రి జరిగిన పార్టీలో నిహారిక కూడా పాల్గొంది. అయితే రాత్రే వీరందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక అప్పటి నుంచి నిహారిక అక్కడే ఉన్నట్టు సమాచారం. ఆ తరువాత పేరెంట్స్ ని పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చి కొందరిని విడుదల చేశారు. ఈరోజు మధ్యాహ్నం నిహారిక పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. పట్టుబడిన వారిలో సినీ, రాజకీయ, పారిశ్రామికవేత్తల పిల్లలు ఉండగా, అందులో కొందరి వద్ద నుంచి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!