Navadeep: నవదీప్, ఈషా రెబ్బ, నరేష్, హరితేజ, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో గౌతమి చిల్లగుల్ల దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ మాయాబజార్ ఫర్ సేల్. గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన ఈ సిరీస్ ను జీ 5తో పాటు రానా దగ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యానర్ సంయుక్తంగా కలిసి నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సిరీస్ జూలై 14 న జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ ను వేగవంతం చేసిన మేకర్స్.. తాజాగా ఈ సిరీస్ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
Manchu Lakshmi: ఏది.. ఈ విషయంలో మంచు లక్ష్మీని ట్రోల్ చేయండి.. చూద్దాం
ఇక ఈ ఈవెంట్ లో నవదీప్ మాట్లాడుతూ.. ” గతంలో పల్లెటూర్లలోని ప్రజలు అందరూ ఒక కుటుంబంలాగా ఉండేవాళ్లు. సాయంత్రమైతే ఓ ఇంటి వద్ద అందరూ కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్లు. అలాంటి ఎమోషన్స్ను డైరెక్టర్ గారు చక్కగా చూపించారు. రకరకాల మనుషులు ఉన్నారు. ఒకరికి పిల్లి నచ్చదు. ఒకరికి కుక్క నచ్చదు. అన్ని పాత్రలను డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎప్పుడో రామానాయుడు గారు మొదలు పెట్టిన ఒక అఖండ దీపాన్ని ముందుకు తీసుకువెళుతూ.. యంగ్ టీమ్ను, కొత్త ప్రొడక్ట్స్ను స్క్రీన్పై తీసుకువస్తున్న మా రానాకు ఆల్ ద బెస్ట్. మాయాబజార్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.. ఈ సిరీస్ మంచి హిట్ అందుకుంటుందని నమ్ముతున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.