Rashmika: రంజింపచేస్తోన్న రష్మిక…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చూడగానే బాగా తెలిసిన పిల్లలా కనిపిస్తుంది నటి రశ్మికా మందన్న. ఆమె లేలేత అందం రువ్వే నవ్వులు కుర్రకారును కిర్రెక్కిస్తున్నాయి. తెలుగునాట అడుగు పెట్టిన దగ్గర నుంచీ అలరిస్తూనే ఉంది రశ్మిక. ఇక ఆమె ఆట, మాట సైతం రంజింపచేస్తూనే ఉన్నాయి. దాంతో తెలుగు చిత్రసీమలో రశ్మిక కాల్ షీట్స్ కు ఎంతో డిమాండ్ పెరిగింది. మాతృభాష కన్నడసీమలోనూ, తమిళ చిత్రసీమలోనూ వెలుగులు విరజిమ్మిన రశ్మిక అందం, హిందీ చిత్రసీమలోనూ తనదైన జిలుగు ప్రదర్శిస్తోంది. అమ్మడి అడుగు అచ్చివస్తుందని సినిమా రంగంలో ఓ సెంటిమెంట్ మొదలయింది.
రశ్మికా మందన్న 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్ లో జన్మించింది. బెంగళూరులోని ఎమ్.ఎస్. రామయ్య ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కాలేజ్ లో సైకాలజీ, జర్నలిజమ్, ఇంగ్లిష్ లిటిరేచర్ లో డిగ్రీ చేసింది రశ్మిక. చదువు కొనే రోజుల్లోనే రశ్మిక చలాకీ తనం ఎందరినో ఆకర్షించసాగింది. రశ్మిక సైతం తన దరికి చేరిన కొత్తదనాన్ని ఆస్వాదించే ప్రయత్నంలో పరుగులు తీసేది. అలా చదువు పూర్తి కాగానే ఇలా సినిమాల్లో నటించే అవకాశం రశ్మిక తలుపు తట్టింది. ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది రశ్మిక. ఈ సినిమాలో రశ్మిక నటన జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఇందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో రశ్మిక డేటింగ్ మొదలెట్టింది. ఇరువైపుల వారు వారి వివాహానికి అంగీకరించారు. దాంతో రక్షిత్, రశ్మిక నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే రశ్మికకు అదే సమయంలో నటిగా మంచి అవకాశాలు తలుపు తట్టాయి. ఈ నేపథ్యంలో ఆమె తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.
Also Read
- Karuppu : కరుప్పు' బ్లాక్బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు 'సూర్య' ఖరీదైన గిఫ్ట్
- Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
- Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
- Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
తెలుగునాట నాగశౌర్య ‘ఛలో’ సినిమాతో అడుగు పెట్టింది రశ్మిక. తరువాత ఆమె, విజయ్ దేవరకొండతో కలసి ‘గీత గోవిందం’లో నటించింది. ఆ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఆ పై ‘దేవ్ దాస్’లో నాని సరసన, ‘డియర్ కామ్రేడ్’లో మరోమారు విజయ్ తోనూ, ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్ బాబుకు జోడీగా, ‘భీష్మ’లో నితిన్ కు నాయికగా నటించిన రశ్మిక ‘పుష్ప’లో అల్లు అర్జున్ జంటగా భలే కనువిందు చేసింది. శర్వానంద్ తో రశ్మిక నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అంతగా ఆకట్టుకోలేక పోయింది. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన నటించిన ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్ తో కలసి ‘గుడ్ బై’లోనూ రశ్మిక కీలక పాత్రలు పోషించింది. హిందీలోనూ ఈ బుల్లెమ్మ ఫ్యాన్స్ ను పోగేసుకుంది. రశ్మిక ప్రస్తుతం ‘పుష్ప-2’లో నటిస్తోంది. ఇది కాకుండా రెండు తెలుగు సినిమాల్లోనూ, ‘యానిమల్’ అనే హిందీ చిత్రంలోనూ రశ్మిక నటించనుంది. అనేక సార్లు సైమా అవార్డుల్లో రశ్మిక ఉత్తమ నటిగా సందడి చేయడం విశేషం! అనతి కాలంలోనే అందరినీ అలరిస్తూ ఆకట్టుకుంటున్న రశ్మిక మునుముందు ఏ తీరున రంజింప చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Tata Tiago EV vs MG Comet EV: టాటా టియాగో EV వర్సెస్ ఎంజీ కామెట్ EV.. రూ.7 లక్షల బడ్జెట్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
-
Vaibhav Sooryavanshi: ‘ఒక్కే ఒక్క కండీషన్..’ వైభవ్పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
-
Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
-
Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
-
Upcoming Smartphones: హువావే, లావా, షియోమి, మోటరోలా నుంచి.. జూన్ మొదటి వారంలో విడుదలయ్యే 5G స్మార్ట్ఫోన్స్ ఇవే
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..