Rashmika: రంజింపచేస్తోన్న రష్మిక…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చూడగానే బాగా తెలిసిన పిల్లలా కనిపిస్తుంది నటి రశ్మికా మందన్న. ఆమె లేలేత అందం రువ్వే నవ్వులు కుర్రకారును కిర్రెక్కిస్తున్నాయి. తెలుగునాట అడుగు పెట్టిన దగ్గర నుంచీ అలరిస్తూనే ఉంది రశ్మిక. ఇక ఆమె ఆట, మాట సైతం రంజింపచేస్తూనే ఉన్నాయి. దాంతో తెలుగు చిత్రసీమలో రశ్మిక కాల్ షీట్స్ కు ఎంతో డిమాండ్ పెరిగింది. మాతృభాష కన్నడసీమలోనూ, తమిళ చిత్రసీమలోనూ వెలుగులు విరజిమ్మిన రశ్మిక అందం, హిందీ చిత్రసీమలోనూ తనదైన జిలుగు ప్రదర్శిస్తోంది. అమ్మడి అడుగు అచ్చివస్తుందని సినిమా రంగంలో ఓ సెంటిమెంట్ మొదలయింది.
రశ్మికా మందన్న 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్ లో జన్మించింది. బెంగళూరులోని ఎమ్.ఎస్. రామయ్య ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కాలేజ్ లో సైకాలజీ, జర్నలిజమ్, ఇంగ్లిష్ లిటిరేచర్ లో డిగ్రీ చేసింది రశ్మిక. చదువు కొనే రోజుల్లోనే రశ్మిక చలాకీ తనం ఎందరినో ఆకర్షించసాగింది. రశ్మిక సైతం తన దరికి చేరిన కొత్తదనాన్ని ఆస్వాదించే ప్రయత్నంలో పరుగులు తీసేది. అలా చదువు పూర్తి కాగానే ఇలా సినిమాల్లో నటించే అవకాశం రశ్మిక తలుపు తట్టింది. ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది రశ్మిక. ఈ సినిమాలో రశ్మిక నటన జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఇందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో రశ్మిక డేటింగ్ మొదలెట్టింది. ఇరువైపుల వారు వారి వివాహానికి అంగీకరించారు. దాంతో రక్షిత్, రశ్మిక నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే రశ్మికకు అదే సమయంలో నటిగా మంచి అవకాశాలు తలుపు తట్టాయి. ఈ నేపథ్యంలో ఆమె తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.
Also Read
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
- Varanasi Movie Update: 'వారణాసి'కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
- Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. 'బెత్లేహెమ్ కుటుంబ యూనిట్' బ్లాక్ బస్టర్
తెలుగునాట నాగశౌర్య ‘ఛలో’ సినిమాతో అడుగు పెట్టింది రశ్మిక. తరువాత ఆమె, విజయ్ దేవరకొండతో కలసి ‘గీత గోవిందం’లో నటించింది. ఆ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఆ పై ‘దేవ్ దాస్’లో నాని సరసన, ‘డియర్ కామ్రేడ్’లో మరోమారు విజయ్ తోనూ, ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్ బాబుకు జోడీగా, ‘భీష్మ’లో నితిన్ కు నాయికగా నటించిన రశ్మిక ‘పుష్ప’లో అల్లు అర్జున్ జంటగా భలే కనువిందు చేసింది. శర్వానంద్ తో రశ్మిక నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అంతగా ఆకట్టుకోలేక పోయింది. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన నటించిన ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్ తో కలసి ‘గుడ్ బై’లోనూ రశ్మిక కీలక పాత్రలు పోషించింది. హిందీలోనూ ఈ బుల్లెమ్మ ఫ్యాన్స్ ను పోగేసుకుంది. రశ్మిక ప్రస్తుతం ‘పుష్ప-2’లో నటిస్తోంది. ఇది కాకుండా రెండు తెలుగు సినిమాల్లోనూ, ‘యానిమల్’ అనే హిందీ చిత్రంలోనూ రశ్మిక నటించనుంది. అనేక సార్లు సైమా అవార్డుల్లో రశ్మిక ఉత్తమ నటిగా సందడి చేయడం విశేషం! అనతి కాలంలోనే అందరినీ అలరిస్తూ ఆకట్టుకుంటున్న రశ్మిక మునుముందు ఏ తీరున రంజింప చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!