MM Srilekha: డైరెక్టర్ అయ్యాక రాజమౌళి మారిపోయాడు.. శ్రీలేఖ సంచలన వ్యాఖ్యలు
MM Srilekha: దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. తమ సోదరులకు, సోదరీమణులు ఎంతో ప్రేమతో రాఖీలు కడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం తమ సోదర సోదరిమణుల ఫోటోలను షేర్ చేస్తూ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తన అన్న రాజమౌళి గురించి సింగర్ ఎమ్ఎమ్ శ్రీలేఖ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూ పాతదే అయినా ఇప్పుడు ట్రెండ్ అవ్వడం విశేషం. ఇక ఈ ఇంటర్వ్యూలో శ్రీలేఖ మాట్లాడుతూ తన అన్నయ్యలు కీరవాణి, రాజమౌళి గురించి చెప్పుకొచ్చింది.
కీరవాణి పాడిన తెలుసా మనసా అనే సాంగ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన ఆమె కీరవాణి తరువాత ఇళయరాజా సాంగ్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక రాజమౌళి ఫ్యామిలీకి తానెప్పుడూ దగ్గరగానే ఉంటానని, సినిమాల పరంగా ఆయన తీరు వేరు, సాంగ్స్ విషయంలో తన తీరు వేరని తెలిపింది. శాంతి నివాసం అనే సీరియల్ చేసే సమయంలో రాజమౌళి తనకు చాక్లెట్లు, మ్యూజిక్ ఆల్బమ్స్ కొనిచ్చేవాడని, డైరెక్టర్ అయ్యాకా రాజమౌళి మారిపోయారని.. ఎందుకంటే పని ఎక్కువ అవ్వడంతో బిజీగా మారిపోయినట్లు తెలిపింది. దీంతో ప్రస్తుతం శ్రీలేఖ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
-
Modi-Trump: బెంగాల్లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
-
Chairmans Desk : ఐదు రాష్ట్రాల ఎన్నికలు పొలిటికల్ ట్రెండ్ మార్చయా? రాజకీయాలు అంటే యుద్ధాలేనా ?
-
CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్పాట్.!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!