‘మిస్సింగ్’ ఫేమ్ మిషా నారంగ్ కు మరో ఛాన్స్!
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా నటించిన ‘తెల్లవారితే గురువారం’ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మిషా నారంగ్. తాజాగా విడుదలైన ‘మిస్సింగ్’ సినిమాలోనూ వన్ ఆఫ్ ద హీరోయిన్స్ గా నటించింది. ఈ సినిమాతో నటిగానూ మిషాకు చక్కని గుర్తింపు లభిస్తోంది. ఇదిలా ఉంటే ఆమె నటిస్తున్న మూడో తెలుగు సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం మొదలైంది. ఈసారి మిషా… సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సరసన చోటు దక్కించుకుంది.
ఆది హీరోగా శివశంకర్ దేవ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అజయ్ శ్రీనివాస్ ఓ క్రైమ్ మిస్టరీ థ్రిలర్ ను విజయ దశమి రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తాజాగా ఈ చిత్రంలో మిషాను నాయికగా ఎంపిక చేశారు. సోమవారం మూవీ రెగ్యులర్ షూటింగ్ నూ ప్రారంభించారు. హైదరాబాద్ కోకాపేట లోని ఒక ప్రైవేట్ హౌస్ లో ఆది సాయికుమార్, మిషా నారంగ్, భూపాల్ పై కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించాడు. కొత్త కాన్సెప్ట్, సరికొత్త కథనంతో సాగే ఈ సినిమాలో ఆది సాయికుమార్ గతంలో ఎప్పుడూ చేయని పాత్ర చేయబోతున్నారని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అలీ రెజా, నందినీరాయ్, తాకర్ పొన్నప్ప, వాసంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించే ఈ సినిమాకు అనీష్ సోలోమాన్ సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Hansika : హన్సిక పై మండిపడుతున్న నెటిజన్ల..
-
Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్కు వస్తాను.!
-
Kash Patel: కాష్ పటేల్ అతిగా మద్యం సేవిస్తారంటూ కథనం.. రూ.2300 కోట్లు దావా వేసిన ఎఫ్బీఐ డైరెక్టర్
-
CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
-
RAAKA : రాకా.. హీరోయిన్ పరిస్థితేంటి?
ట్రెండింగ్
-
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO M8s 5G లాంచ్.!
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!