Site icon NTV Telugu

Mirai’s triumph : ఘనంగా జరిగిన ‘మిరాయ్‌’ విజయోత్సవ వేడుక..

Mirai

Mirai

సెప్టెంబర్ 12న విడుదలైన ‘మిరాయ్‌’ సినిమా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా, నాణ్యమైన సినిమాటిక్ విలువలను మన దేశంలోనే సాధించగలమని నిరూపించింది. హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ గల బృందం ఈ చిత్రాన్ని రూపొందించగా. ప్రత్యేకంగా, సాంకేతిక నైపుణ్యం, ప్రొడక్షన్ క్వాలిటీ, నటనలో చూపిన అంకితభావం అని ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అయితే తాజాగా హైదరాబాద్‌లో ‘మిరాయ్‌’ విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కథానాయిక రితికా నాయక్, సంగీత దర్శకుడు గౌర హరి, సినీ ప్రముఖులు వై. రవిశంకర్, శ్రీరామ్ ఆదిత్య, సంపత్ నంది, వెంకటేష్ మహా, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : Telusukada: ఫస్ట్ ఛాయిస్ నితిన్.. ‘తెలుసు కదా’ వెనుకున్న షాకింగ్ స్టోరీ..!

తేజ సజ్జా మాట్లాడుతూ “ఒక మంచి సినిమా వచ్చిందంటే, దాన్ని ప్రేక్షకులు గౌరవించాలి. ఈ సినిమా కోసం చేసిన కృషి, పడిన శ్రమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రత్యేకంగా, సాంకేతిక బృందం చేసిన కృషికి ఈ వేడుక అంకితభావం గా జరిగింది. దర్శకుడు కార్తీక్ మరియు బృందం చూపిన అంకితభావం నిజంగా ప్రత్యేకం” అని అన్నారు. అలాగే నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ ఈ సినిమా భవిష్యత్తులో ప్రపంచ స్థాయి ఫ్రాంచైజీగా మారనుందని తెలిపారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. ‘సినిమా తీయడం మొదలు పెట్టినప్పటి నుండి ప్రతి సన్నివేశం ఒక ప్రత్యేక మ్యాజిక్ లా అనిపించింది, అందరి సహకారంతోనే ‘మిరాయ్‌’ విజయం సాదించింది’ అని పేర్కొన్నారు. ప్రజంట్ ఈ ఈవెంట్ కి సంబంధించిన మాటలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version