Musical Drama : గొంతు క్యాన్సర్ తో పోరాడే రేడియో జాకీ… నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి మలయాళ ఎమోషనల్ డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Musical Drama : మలయాళ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు, హృదయాన్ని తాకే కథలతో మలయాళ చిత్రాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. నాలుగేళ్ల క్రితం మలయాళంలో విడుదలై ప్రేక్షకుల హృదయాలను కదిలించిన ఒక ఎమోషనల్ మ్యూజికల్ డ్రామా ఇప్పుడు తెలుగులో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషి జీవితంలో కొన్ని మంచి క్షణాలు ఎంత అందంగా ఉంటాయో అనుభవించేవాళ్ళకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ కోరుకునేది కూడా అలాంటి జీవితమే. అయితే కొన్ని సార్లు ఊహించని విధంగా విధి జీవితాన్ని ఆడుకుంటుంది. నిన్నటి వరకు నవ్వులతో, కలలతో, ఆత్మవిశ్వాసంతో నిండిపోయిన జీవితం… ఒక్క క్షణంలో చీకట్లోకి జారిపోతుంది. కానీ ఆ చీకట్లో కూడా మళ్లీ వెలుగు నింపుకోవడమే నిజమైన జీవితం అని గుర్తు చేసే ఎమోషనల్ స్టోరీనే ఈ ‘మేరీ ఆవాజ్ సునో’ సినిమా.
‘ఈటీవీ విన్'(ETV Win)లో స్ట్రీమింగ్
ఈ మలయాళ ఎమోషనల్ మ్యూజికల్ డ్రామా ‘మేరీ ఆవాజ్ సునో’ కూడా ఇప్పుడు ప్రేక్షకుల మనసులను తాకే సినిమాగా మారుతోంది. 2022లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మే 27 (ఈ రోజు) నుంచి ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్'(ETV Win)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఆర్జే శంకర్ పాత్రలో మలయాళ స్టార్ హీరో జయసూర్య అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. డాక్టర్ రేష్మిగా మంజు వారియర్ మరోసారి తానేంటో నిరూపించింది. ఈ ఇద్దరు దిగ్గజ నటులు తొలిసారి కలిసి నటించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. వీరితో పాటు శివద, జానీ ఆంటోని, గౌతమి నాయర్, సుధీర్ కరమణ వంటి నటీనటులు కూడా కథను బలంగా నిలబెట్టారు. 2019లో విడుదలై ప్రశంసలు అందుకున్న బెంగాలీ చిత్రం ‘కంటో’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రజేష్ సేన్ దర్శకత్వం వహించగా, బి. రాకేష్ ఈ సినిమాను నిర్మించారు.
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ సినిమా కథ ఏమిటంటే
ఈ కథ మొత్తం శంకర్ అనే ఒక రేడియో జాకీ చుట్టూ తిరుగుతుంది. తన గొంతుతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న శంకర్కు ఆ వాయిస్ ఒక ప్రపంచం. అతని మాటలు వినేందుకు ప్రజలు కూడా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి సమయంలో అతనికి లారింజియల్ క్యాన్సర్ ఉందని తెలిసిపోతుంది. చికిత్స కోసం అతని గొంతు శాశ్వతంగా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక రేడియో జాకీకి గొంతు అంటేనే జీవితం. అలాంటి జీవితమే ఒక్కసారిగా ముగిసిపోయిందని భావించిన శంకర్ తీవ్ర నిరాశలో కూరుకుపోతాడు. తాను ఇక పనికిరానివాడిననే ఆలోచన అతన్ని పూర్తిగా మానసికంగా కుంగదీస్తుంది.
అక్కడి నుంచే కథ ఓ కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. స్పీచ్ థెరపిస్ట్ డాక్టర్ రేష్మి అతని జీవితంలోకి రావడం, ఓడిపోయాననుకున్న ఆ మనిషిలో మళ్లీ ఆశ చిగురించడంతో సినిమాను చూసే ఆడియన్స్ లో కూడా కళ్ళు చెమ్మగిల్లుతాయి. జీవితంలో అన్నీ ముగిసిపోయాయని అనుకునే ప్రతి వ్యక్తికి ఈ కథ ఒక చిన్న ధైర్యం ఇస్తుంది. ముఖ్యంగా మానసికంగా కుంగిపోయిన వ్యక్తి తిరిగి ఎలా నిలబడగలడో ఇందులో చాలా ఎమోషనల్ గా చూపించారు.
తాజావార్తలు
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
-
Robbery : గచ్చిబౌలిలో బస్సు దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం
-
Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్కి తిరుగులేదు!”.
-
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!