Musical Drama : గొంతు క్యాన్సర్ తో పోరాడే రేడియో జాకీ… నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి మలయాళ ఎమోషనల్ డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Musical Drama : మలయాళ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు, హృదయాన్ని తాకే కథలతో మలయాళ చిత్రాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. నాలుగేళ్ల క్రితం మలయాళంలో విడుదలై ప్రేక్షకుల హృదయాలను కదిలించిన ఒక ఎమోషనల్ మ్యూజికల్ డ్రామా ఇప్పుడు తెలుగులో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషి జీవితంలో కొన్ని మంచి క్షణాలు ఎంత అందంగా ఉంటాయో అనుభవించేవాళ్ళకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ కోరుకునేది కూడా అలాంటి జీవితమే. అయితే కొన్ని సార్లు ఊహించని విధంగా విధి జీవితాన్ని ఆడుకుంటుంది. నిన్నటి వరకు నవ్వులతో, కలలతో, ఆత్మవిశ్వాసంతో నిండిపోయిన జీవితం… ఒక్క క్షణంలో చీకట్లోకి జారిపోతుంది. కానీ ఆ చీకట్లో కూడా మళ్లీ వెలుగు నింపుకోవడమే నిజమైన జీవితం అని గుర్తు చేసే ఎమోషనల్ స్టోరీనే ఈ ‘మేరీ ఆవాజ్ సునో’ సినిమా.
‘ఈటీవీ విన్'(ETV Win)లో స్ట్రీమింగ్
ఈ మలయాళ ఎమోషనల్ మ్యూజికల్ డ్రామా ‘మేరీ ఆవాజ్ సునో’ కూడా ఇప్పుడు ప్రేక్షకుల మనసులను తాకే సినిమాగా మారుతోంది. 2022లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మే 27 (ఈ రోజు) నుంచి ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్'(ETV Win)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఆర్జే శంకర్ పాత్రలో మలయాళ స్టార్ హీరో జయసూర్య అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. డాక్టర్ రేష్మిగా మంజు వారియర్ మరోసారి తానేంటో నిరూపించింది. ఈ ఇద్దరు దిగ్గజ నటులు తొలిసారి కలిసి నటించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. వీరితో పాటు శివద, జానీ ఆంటోని, గౌతమి నాయర్, సుధీర్ కరమణ వంటి నటీనటులు కూడా కథను బలంగా నిలబెట్టారు. 2019లో విడుదలై ప్రశంసలు అందుకున్న బెంగాలీ చిత్రం ‘కంటో’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రజేష్ సేన్ దర్శకత్వం వహించగా, బి. రాకేష్ ఈ సినిమాను నిర్మించారు.
Also Read
- Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
- DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
- Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
ఈ సినిమా కథ ఏమిటంటే
ఈ కథ మొత్తం శంకర్ అనే ఒక రేడియో జాకీ చుట్టూ తిరుగుతుంది. తన గొంతుతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న శంకర్కు ఆ వాయిస్ ఒక ప్రపంచం. అతని మాటలు వినేందుకు ప్రజలు కూడా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి సమయంలో అతనికి లారింజియల్ క్యాన్సర్ ఉందని తెలిసిపోతుంది. చికిత్స కోసం అతని గొంతు శాశ్వతంగా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక రేడియో జాకీకి గొంతు అంటేనే జీవితం. అలాంటి జీవితమే ఒక్కసారిగా ముగిసిపోయిందని భావించిన శంకర్ తీవ్ర నిరాశలో కూరుకుపోతాడు. తాను ఇక పనికిరానివాడిననే ఆలోచన అతన్ని పూర్తిగా మానసికంగా కుంగదీస్తుంది.
అక్కడి నుంచే కథ ఓ కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. స్పీచ్ థెరపిస్ట్ డాక్టర్ రేష్మి అతని జీవితంలోకి రావడం, ఓడిపోయాననుకున్న ఆ మనిషిలో మళ్లీ ఆశ చిగురించడంతో సినిమాను చూసే ఆడియన్స్ లో కూడా కళ్ళు చెమ్మగిల్లుతాయి. జీవితంలో అన్నీ ముగిసిపోయాయని అనుకునే ప్రతి వ్యక్తికి ఈ కథ ఒక చిన్న ధైర్యం ఇస్తుంది. ముఖ్యంగా మానసికంగా కుంగిపోయిన వ్యక్తి తిరిగి ఎలా నిలబడగలడో ఇందులో చాలా ఎమోషనల్ గా చూపించారు.
తాజావార్తలు
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!