Musical Drama : గొంతు క్యాన్సర్ తో పోరాడే రేడియో జాకీ… నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి మలయాళ ఎమోషనల్ డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Musical Drama : మలయాళ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు, హృదయాన్ని తాకే కథలతో మలయాళ చిత్రాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. నాలుగేళ్ల క్రితం మలయాళంలో విడుదలై ప్రేక్షకుల హృదయాలను కదిలించిన ఒక ఎమోషనల్ మ్యూజికల్ డ్రామా ఇప్పుడు తెలుగులో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషి జీవితంలో కొన్ని మంచి క్షణాలు ఎంత అందంగా ఉంటాయో అనుభవించేవాళ్ళకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ కోరుకునేది కూడా అలాంటి జీవితమే. అయితే కొన్ని సార్లు ఊహించని విధంగా విధి జీవితాన్ని ఆడుకుంటుంది. నిన్నటి వరకు నవ్వులతో, కలలతో, ఆత్మవిశ్వాసంతో నిండిపోయిన జీవితం… ఒక్క క్షణంలో చీకట్లోకి జారిపోతుంది. కానీ ఆ చీకట్లో కూడా మళ్లీ వెలుగు నింపుకోవడమే నిజమైన జీవితం అని గుర్తు చేసే ఎమోషనల్ స్టోరీనే ఈ ‘మేరీ ఆవాజ్ సునో’ సినిమా.
‘ఈటీవీ విన్'(ETV Win)లో స్ట్రీమింగ్
ఈ మలయాళ ఎమోషనల్ మ్యూజికల్ డ్రామా ‘మేరీ ఆవాజ్ సునో’ కూడా ఇప్పుడు ప్రేక్షకుల మనసులను తాకే సినిమాగా మారుతోంది. 2022లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మే 27 (ఈ రోజు) నుంచి ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్'(ETV Win)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఆర్జే శంకర్ పాత్రలో మలయాళ స్టార్ హీరో జయసూర్య అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. డాక్టర్ రేష్మిగా మంజు వారియర్ మరోసారి తానేంటో నిరూపించింది. ఈ ఇద్దరు దిగ్గజ నటులు తొలిసారి కలిసి నటించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. వీరితో పాటు శివద, జానీ ఆంటోని, గౌతమి నాయర్, సుధీర్ కరమణ వంటి నటీనటులు కూడా కథను బలంగా నిలబెట్టారు. 2019లో విడుదలై ప్రశంసలు అందుకున్న బెంగాలీ చిత్రం ‘కంటో’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రజేష్ సేన్ దర్శకత్వం వహించగా, బి. రాకేష్ ఈ సినిమాను నిర్మించారు.
Also Read
- GV Prakash: క్రేజీ మల్టీస్టారర్ కోసం అనిల్ రావిపూడి బిగ్ స్కెచ్.. మ్యూజిక్ డైరెక్టర్గా ఆ కోలీవుడ్ స్టార్!
- Thriller Movie : చీకటి పడితే భయంతో తలుపులు మూసేసుకునే గ్రామం... ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్
- PEDDI : ఒక్క పోస్టర్తో కథ చెప్పేశారు.. పెద్ది స్టోరీ ఇదేనా?
- Disha-Mouni: లెస్బియన్ రూమర్స్కు చెక్ పెట్టాలనుకున్న మౌనీ రాయ్.. కానీ రివర్స్ అయిందే..?
ఈ సినిమా కథ ఏమిటంటే
ఈ కథ మొత్తం శంకర్ అనే ఒక రేడియో జాకీ చుట్టూ తిరుగుతుంది. తన గొంతుతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న శంకర్కు ఆ వాయిస్ ఒక ప్రపంచం. అతని మాటలు వినేందుకు ప్రజలు కూడా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి సమయంలో అతనికి లారింజియల్ క్యాన్సర్ ఉందని తెలిసిపోతుంది. చికిత్స కోసం అతని గొంతు శాశ్వతంగా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక రేడియో జాకీకి గొంతు అంటేనే జీవితం. అలాంటి జీవితమే ఒక్కసారిగా ముగిసిపోయిందని భావించిన శంకర్ తీవ్ర నిరాశలో కూరుకుపోతాడు. తాను ఇక పనికిరానివాడిననే ఆలోచన అతన్ని పూర్తిగా మానసికంగా కుంగదీస్తుంది.
అక్కడి నుంచే కథ ఓ కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. స్పీచ్ థెరపిస్ట్ డాక్టర్ రేష్మి అతని జీవితంలోకి రావడం, ఓడిపోయాననుకున్న ఆ మనిషిలో మళ్లీ ఆశ చిగురించడంతో సినిమాను చూసే ఆడియన్స్ లో కూడా కళ్ళు చెమ్మగిల్లుతాయి. జీవితంలో అన్నీ ముగిసిపోయాయని అనుకునే ప్రతి వ్యక్తికి ఈ కథ ఒక చిన్న ధైర్యం ఇస్తుంది. ముఖ్యంగా మానసికంగా కుంగిపోయిన వ్యక్తి తిరిగి ఎలా నిలబడగలడో ఇందులో చాలా ఎమోషనల్ గా చూపించారు.
తాజావార్తలు
-
Musical Drama : గొంతు క్యాన్సర్ తో పోరాడే రేడియో జాకీ… నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి మలయాళ ఎమోషనల్ డ్రామా
-
Telangana Congress: గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల డిష్యూం.. డిష్యూం.. చొక్కాలు పట్టుకుని మరీ..
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
GV Prakash: క్రేజీ మల్టీస్టారర్ కోసం అనిల్ రావిపూడి బిగ్ స్కెచ్.. మ్యూజిక్ డైరెక్టర్గా ఆ కోలీవుడ్ స్టార్!
-
Health Tips : తులసి మొక్క ఎండిపోయినా.. మీ ఇంటికి ఇంకా ఉపయోగమే..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!