రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ టీమ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సినిమాకు పనిచేస్తున్న ఓ క్రూ మెంబర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై మంచు మనోజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా.. న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ చేశారు. ‘డేవిడ్ రెడ్డి’ చిత్రానికి DOP విభాగంలో లక్ష్మణ్ రావు అనే టెక్నీషియన్ పనిచేస్తున్నారు. అయితే, ఆయన హఠాత్తుగా అనుమానాస్పద రీతిలో మరణించారు. ఈ వార్త విన్న వెంటనే మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యారు. తన టీమ్ మెంబర్ను కోల్పోవడం పట్ల ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
లక్ష్మణ్ రావుది సాధారణ మరణం కాదని, దీని వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మంచు మనోజ్ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. “లక్ష్మణ్ రావు మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ అనుమానాస్పద మృతి వెనుక ఉన్న అసలు నిజాలు వెంటనే బయటకు రావాలి. ఈ ఘటనపై ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి” అని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరగాలని కోరుతూ.. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల డీజీపీలను (DGPs) మనోజ్ తన ట్వీట్లో ట్యాగ్ చేశారు. “ఈ మరణం వెనుక ఎవరున్నా.. నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టకూడదు. వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలి. ఏ నేరమూ శిక్ష పడకుండా, చట్టం కళ్లుగప్పి తప్పించుకోకూడదు” అని పోలీసులను కోరారు. మనోజ్ చేసిన ఈ సంచలన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Shocked and deeply saddened by the tragic loss of our Lakshman Rao anna, a sincere and hardworking member of our film #DavidReddy team. Such a sweet and happy soul.
His passing under such mysterious circumstances is truly heartbreaking.
My heartfelt condolences to his family.
I… pic.twitter.com/wQ6PMIDEgw— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 16, 2026