Betting Apps Case : నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న మంచు లక్ష్మి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసు టాలీవుడ్లో పెద్ద సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు వేగం పెంచింది. గత కొద్ది వారాలుగా ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల పై విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నటుడు విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, రానా దగ్గుబాటి వంటి స్టార్లు విచారణకు హాజరై తమ వివరణ ఇచ్చారు. వీరితో పాటు కొన్ని ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను కూడా ఈడీ ప్రశ్నించింది. ఈ కేసు మూలాలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా అనధికారికంగా జరిగిన, భారీ స్థాయి డబ్బు లావాదేవీల్లో ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ యాప్ ద్వారా దేశం లోపల, బయటకు కోట్ల రూపాయలు మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా, డబ్బు పంపిణీ, చెల్లింపులు, ప్రమోషనల్ ఈవెంట్స్, బ్రాండ్ ఎంటర్స్మెంట్లలో భాగస్వామ్యంపై సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా..
ఇప్పటికే పలువురు ప్రముఖ సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు వరుసగా విచారణకు హాజరవుతుండగా, నేడు (ఆగస్టు 13) నటి మంచు లక్ష్మీ కూడా ఈడీ ముందు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతారని సమాచారం. అయితే ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, మంచు లక్ష్మిని ముఖ్యంగా ఆమె ప్రమోట్ చేసిన ఈవెంట్స్, సంబంధిత వ్యక్తులు, ఆర్థిక లావాదేవీల పై ప్రశ్నించనున్నారు. ఇంత వరకు విచారణకు హాజరైనవారు తాము ఈ యాప్ యొక్క మనీలాండరింగ్ అంశాల గురించి తెలియదని స్పష్టంచేసినప్పటికీ, అధికారులు ఆర్థిక డాక్యుమెంట్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆధారంగా మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది నటులు, ఇన్ఫ్లూయెన్సర్లు కూడా ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!