SSMB 28: సూపర్ స్టార మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం SSMB28. అతడు, ఖలేజా సినిమాల తరువాత వస్తున్న చిత్రంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం క్యాస్టింగ్ పనిలో బిజీగా ఉన్న త్రివిక్రమ్ పాత్రకు తగ్గవారికోసం వెతుకులాట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమాలో హీరో తరుణ్ ఒక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్న విషయం విదితమే. తరుణ్ హీరోగా నువ్వే నువ్వే చిత్రంతో త్రివిక్రమ్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు. ఇక తరుణ్ రీ ఎంట్రీ కూడా త్రివిక్రమే తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయమై ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో మరో యంగ్ హీరోకు పాత్ర ఉంది కానీ తాము తరుణ్ ను అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా తరుణ్ కూడా తనను ఎవరు సంప్రదించలేదని, ఏదైనా ఉంటే తానే డైరెక్ట్ గా చెప్తానని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ పాత్రలో తరుణ్ నటించడం లేదని కన్ఫర్మ్ అయ్యింది. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం మలయాళ హీరో రోషన్ మ్యాథ్యును సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో రోషన్ స్టార్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రోషన్ ఈ మధ్యనే అలియా తో కలిసి డార్లింగ్ లో నటించి మంచి హిట్ అందుకున్నాడు. నేడు రిలీజ్ అయిన కోబ్రా లో విలన్ గా నటించి మెప్పించాడు. తెలుగులో త్రివిక్రమ్ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు ఈ హీరో.. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.