Guntur Kaaram: ‘గుంటూరు కారం’కి డేట్స్ కష్టాలు.. మళ్లీ వాయిదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoot Shufflings for Mahesh Babu’s Guntur Kaaram: ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ అనేకసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి రావడంతో షూట్ కాస్త వాయిదా పడింది. ఆ తర్వాత మహేష్ బాబు తల్లి, తండ్రి మరణించడంతో మరి కొన్నాళ్లు వాయిదా పడింది. ఇక మహేష్ బాబు ఇంకా దుఃఖం నుంచి బయటకు రాకపోవడంతో మళ్లీ మళ్లీ వాయిదా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా ఈ నెలలో ప్రారంభం కావాల్సిన షెడ్యూల్ కూడా నిరవధికంగా వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి గుంటూరు కారం సినిమా తాజా షెడ్యూల్ జూన్ 12న మొదలు కావాల్సి ఉంది.
Megastar’s next: మెగాస్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రీమేక్ టెన్షన్ లేనట్టే?
Also Read
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
- Ranabaali : 'రణబాలి' వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
- Kollywood Movie Updates : తమిళ హీరోలకు రెమ్యూనరేషన్ కష్టాలు... నిన్న అజిత్ నేడు విక్రమ్
- Bollywood Gossip : నేను 'గే' కాదు... హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
కానీ సినిమాలో ఉన్న ఇతర ఆర్టిస్టుల డేట్లు క్లాష్ రావడంతో దానిని 20వ తేదీకి మార్చారని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అప్పటికి కూడా ఈ సమస్య క్లియర్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఏకంగా వచ్చే నెలకు షూటింగ్ వాయిదా వేసినట్లుగా చెబుతున్నారు. దర్శక నిర్మాతలు కావాలని చేయకపోయినా ఇలా సినిమాని పదే పదే వాయిదా వేస్తూ రావడం మహేష్ బాబు అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. మరోపక్క ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు మేకర్స్. ఈ మధ్యనే ఒక గ్లింప్స్ రిలీజ్ చేసి కచ్చితంగా రిలీజ్ వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 13న చేస్తామని ప్రకటించారు. 12 ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గుంటూరు కారం సినిమాలో స్టార్ టెక్నీషియన్లు భాగమయ్యారు. సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్, స్టార్ మ్యూజిషియన్ థమన్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్, జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ నవీన్ నూలి ఈ సినిమాకి పనిచేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ మీద ఈ సినిమాని ఎస్ రాధాకృష్ణ, ఎస్ నాగ వంశీ నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!