Site icon NTV Telugu

బంపర్ మెజారిటీతో వస్తానంటున్న ‘మాచర్ల నియోజకవర్గం’..

యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలను లైన్లో పెట్టి జోష్ పెంచాడు. ‘మాస్ట్రో’ చిత్రం కొద్దిగా నిరాశపరచడంతో నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో రెడీ అయిపోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎం.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సందడి చేయనుంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ తాజాగా రిలీజ్ డేట్ ని ప్రకటించేసింది. ” ఈసారి థియేటర్ కే వచ్చేది బంపర్ మెజారిటీతో..” అంటూ ఏప్రిల్ 29 న సినిమా విడుదల కానున్నట్లు తెలిపారు. మరి ఈ సినిమా నితిన్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Exit mobile version