‘లవ్ స్టోరి’ సక్సెస్ ఆనందాన్నిచ్చింది: యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ పట్ల యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఏషియన్ సినిమాస్ కార్యాలయంలో జరిగిన సక్సెస్ మీట్ లో శేఖర్ కమ్ముల, నాగచైతన్య, సాయి పల్లవి, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, పి.రామ్మోహన్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన యూనిట్ ‘లవ్ స్టోరి’ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘ఎంతో కష్టపడి ఈ సినిమాను మీ ముందుకు తీసుకొచ్చాం. ప్రేక్షకులు గొప్ప విజయాన్ని అందించారు. మాటలు రావడం లేదు. కులం పేరుతో ఇబ్బందులు పడే హీరోకు, చిన్నప్పటి నుంచి వివక్షకు, బాధలకు గురైన అమ్మాయికి మధ్య జరిగిన కథ ఇది. నిర్భయ ఘటన తర్వాత సొసైటీకి మంచిని చెప్పే సినిమా చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత స్కూల్స్, కాలేజీలకు వెళ్లి ధీర నువ్వే ధీర అనే అవేర్ నెస్ ప్రోగ్రాం చేశాం. అక్కడే ఈ సినిమాకు కథ దొరికింది. నా మీద నమ్మకంతో థియేటర్లకు వచ్చిన ఆడియెన్స్ కు థాంక్స్’ అని చెప్పారు.
నాగ చైతన్య మాట్లాడుతూ ‘ఈ టైమ్ లో ఆడియెన్స్ రారేమో అని భయపడ్డాం. థియేటర్స్ లో ప్రేక్షకులను చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇందులో అడ్రస్ చేసిన ఇష్యూస్ కు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇది థియేటర్ లలోనే చూడాల్సిన సినిమా’ అన్నారు. సాయి పల్లవి మాట్లాడుతూ ‘ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఇండస్ట్రీలో అందరూ కోరుకున్నారు. స్టార్స్ ట్వీట్స్ చేశారు. ఇతర ఇండస్ట్రీ స్టార్స్ సపోర్ట్ చేశారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు. మన చుట్టూ సమాజంలో ఇళ్ళల్లో జరిగే సమస్యలు చూపించాము. సొసైటీకి ఉపయోగపడే ఈ పాయింట్స్ ను టచ్ చేసిన శేఖర్ కమ్ముల గారిని అభినందించాలి’ అని తెలిపారు.
Also Read
- Peddi Censor Review : 'రంగస్థలం'ను మించిన యాక్టింగ్.... లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
- Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
- He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
నిర్మాత పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ ‘సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో భారీగా రిలీజైన సినిమా మాది. దీనికి సపోర్ట్ చేసిన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కు థాంక్స్. శేఖర్ కమ్ముల, నాగచైతన్య, సాయి పల్లవి తో మాకు మంచి బాండింగ్ ఉంది. ఈ అసోసియేషన్ ఇకపైనా కొనసాగుతుంది’ అని అన్నారు. ఇదే కాంబినేషన్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల నెక్ట్ ఇయర్ మరో సినిమా చేయాలని కోరుకుంటున్నా అని సునీల్ నారంగ్ కోరారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!