‘లవ్ స్టోరి’ సక్సెస్ ఆనందాన్నిచ్చింది: యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ పట్ల యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఏషియన్ సినిమాస్ కార్యాలయంలో జరిగిన సక్సెస్ మీట్ లో శేఖర్ కమ్ముల, నాగచైతన్య, సాయి పల్లవి, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, పి.రామ్మోహన్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన యూనిట్ ‘లవ్ స్టోరి’ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘ఎంతో కష్టపడి ఈ సినిమాను మీ ముందుకు తీసుకొచ్చాం. ప్రేక్షకులు గొప్ప విజయాన్ని అందించారు. మాటలు రావడం లేదు. కులం పేరుతో ఇబ్బందులు పడే హీరోకు, చిన్నప్పటి నుంచి వివక్షకు, బాధలకు గురైన అమ్మాయికి మధ్య జరిగిన కథ ఇది. నిర్భయ ఘటన తర్వాత సొసైటీకి మంచిని చెప్పే సినిమా చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత స్కూల్స్, కాలేజీలకు వెళ్లి ధీర నువ్వే ధీర అనే అవేర్ నెస్ ప్రోగ్రాం చేశాం. అక్కడే ఈ సినిమాకు కథ దొరికింది. నా మీద నమ్మకంతో థియేటర్లకు వచ్చిన ఆడియెన్స్ కు థాంక్స్’ అని చెప్పారు.
నాగ చైతన్య మాట్లాడుతూ ‘ఈ టైమ్ లో ఆడియెన్స్ రారేమో అని భయపడ్డాం. థియేటర్స్ లో ప్రేక్షకులను చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇందులో అడ్రస్ చేసిన ఇష్యూస్ కు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇది థియేటర్ లలోనే చూడాల్సిన సినిమా’ అన్నారు. సాయి పల్లవి మాట్లాడుతూ ‘ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఇండస్ట్రీలో అందరూ కోరుకున్నారు. స్టార్స్ ట్వీట్స్ చేశారు. ఇతర ఇండస్ట్రీ స్టార్స్ సపోర్ట్ చేశారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు. మన చుట్టూ సమాజంలో ఇళ్ళల్లో జరిగే సమస్యలు చూపించాము. సొసైటీకి ఉపయోగపడే ఈ పాయింట్స్ ను టచ్ చేసిన శేఖర్ కమ్ముల గారిని అభినందించాలి’ అని తెలిపారు.
Also Read
- Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
- Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
- Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
- Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
నిర్మాత పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ ‘సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో భారీగా రిలీజైన సినిమా మాది. దీనికి సపోర్ట్ చేసిన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కు థాంక్స్. శేఖర్ కమ్ముల, నాగచైతన్య, సాయి పల్లవి తో మాకు మంచి బాండింగ్ ఉంది. ఈ అసోసియేషన్ ఇకపైనా కొనసాగుతుంది’ అని అన్నారు. ఇదే కాంబినేషన్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల నెక్ట్ ఇయర్ మరో సినిమా చేయాలని కోరుకుంటున్నా అని సునీల్ నారంగ్ కోరారు.
తాజావార్తలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!