అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ప్రేక్షకులు ఈ సినిమా విడుదల గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
Read Also : యమ్మీ… నోరూరిస్తున్న రకుల్ !
ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అవుతుందంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత “లవ్ స్టోరీ థియేటర్లలోనే అని, సెప్టెంబర్ 10న “లవ్ స్టోరీ”ని ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 10 న విడుదల అవుతుందంటూ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా పాటలు పెద్ద హిట్ అయ్యాయి. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది.మేకర్స్ త్వరలో సినిమా ప్రమోషన్లను ప్రారంభిస్తారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని కూడా ప్రకటిస్తారు.