Site icon NTV Telugu

IPL : కోల్ కత్తా-పంజాబ్ మ్యాచ్ రద్దు..

Ipl

Ipl

IPL : కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సిన కోల్ కత్తా-పంజాబ్ మ్యాచ్ రద్దు అయింది. ఈడెన్ గార్డెన్స్ లో భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కత్తా కొద్దిసేపు బ్యాటింగ్ చేయగానే వర్షం స్టార్ట్ అయింది. ఎంతకూ తగ్గకపోగా.. అంతకంతకూ వర్షం పెరుగుతూ ఉండటంతో మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితులు వచ్చాయి. దీంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. పెద్ద ఎత్తున గ్రౌండ్ కు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. పంజాబ్ నుంచి ప్రియాంశ్‌ ఆర్య 69, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 83లు రాణించడంతో మంచి స్కోర్ చేసింది.
Read Also : Rohit Sharma: ఆ.. భారీ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ

Exit mobile version