Dude : ఆర్య సినిమానే నా ప్రేరణ – డ్యూడ్ దర్శకుడు కీర్తిశ్వరన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మనసులో శాశ్వత ముద్ర వేస్తాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ సినిమా. విడుదలైనప్పటి నుంచి 20 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ, దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన సంగీతం, సినిమా మొత్తం ఇంకా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఆర్య సినిమా డబ్బింగ్ వెర్షన్లు తెలుగు రాష్ట్రాల కల్లా, భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రాధాన్యం అందుకుంది. అయితే ఈ దీపావళి సీజన్లో, డ్యూడ్ సినిమా సహా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ, దాని ప్రచార కార్యక్రమాలు మాత్రం ప్రేక్షకులలో పెద్దగా ఆసక్తి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్లో ‘డ్యూడ్’ ప్రీ లిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించింది.
Also Read : Kantara-Chapter-1 : కాంతార చాప్టర్ 1 నుంచి దీపావళి గిఫ్ట్ రెడీ! ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ పీక్స్లో
Also Read
- Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
- Trisha: 'తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..' పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
- Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
- NP50 : నివిన్ పౌలి 50 'విజయం'.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
డ్యూడ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న కీర్తిశ్వరన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సూరరై పోట్రు (తెలుగులో ‘ఆకాశం నీ హధుర’)లో సుధ కొంగర మాజీ సహాయకుడిగా పని చేసిన అనుభవం, డ్యూడ్ రాస్తున్నప్పుడు ఆర్య సినిమా తనకు ప్రేరణగా నిలిచిందని తెలిపారు. “నాకు ఆర్య మూవీ అంటే చాలా ఇష్టం . డ్యూడ్ చేయడానికి అది నాకు ఒక గొప్ప ప్రేరణగా నిలిచింది” అని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులతో తన అనుబంధాన్ని వివరిస్తూ, “నేను చెన్నైలో పుట్టి పెరిగినప్పటికీ, నా మొదటి సినిమా ఆఫర్ తెలుగువాడైన మైత్రి మూవీ మేకర్స్ నుండి వచ్చింది. సుధా కొంగర దగ్గర పని చేయడం, సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మితో నా స్నేహం ఈ అవకాశానికి దారితీసింది. కొత్త దర్శకులను ప్రోత్సహించడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ మైత్రి మూవీ మేకర్స్ నా స్క్రిప్ట్ను ఒకే కథనంలో ఓకే చేశారు ” అని చెప్పారు.
ఈ చిత్రంలో లవ్ టుడే మరియు డ్రాగన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు పొందిన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించారు. సాయి అభ్యాంకర్ సంగీతం అందించగా, ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వ బాధ్యతలు కీర్తిశ్వరన్ స్వయంగా నిర్వహించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..