జయలలిత లాంటి స్ట్రాంగ్ లేడీగా నటించడం నా అదృష్టం : కంగనా రనౌత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పటి అందాల నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ “తలైవి” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్లో గ్రాండ్ గా జరిగింది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలితగా నటించింది.
Read Also : “తలైవి”లో నటించడం అద్భుతమైన అనుభవం: అరవింద్ స్వామి
Also Read
ఈ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ “తలైవి”పై సంతకం చేయడానికి ముందు తనకు తమిళ రాజకీయాల గురించి ఏమీ తెలియదని అన్నారు. “రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు నేను జయలలితను పునరావృతం చేయగలనని విశ్వసించారు. కానీ నా గురించి ఆయనకు ఉన్న నమ్మకం నన్ను ఆశ్చర్యపరిచింది. తెరపై నన్ను నేను చూసుకున్న తర్వాత నేను జయలలితగా నటించానంటే ఆశ్చర్యంగా ఉంది” అని కంగన చెప్పింది. బాక్సాఫీస్ వద్ద తలైవి విజయంపై కూడా కంగనా నమ్మకం వ్యక్తం చేసింది. జయలలిత లాంటి స్ట్రాంగ్ లేడీగా నటించడం తన అదృష్టంఅని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.
ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు అరవింద్ స్వామి “ఎంజిఆర్”గా కనిపిస్తారు. విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన కంగనా లుక్స్, ట్రైలర్, సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!