NTV Telugu Site icon

JD Chakravarthy: ఆ హీరోయిన్ కోసం నేను, కృష్ణవంశీ కొట్టుకున్నాం..అర్ధరాత్రి అరకు నుంచి

Jd

Jd

JD Chakravarthy: టాలీవుడ్ హీరో జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గులాబీ దగ్గర నుంచి మొన్న మొన్న వచ్చిన దహనం వరకు ఆయన మార్క్ కనిపించేలా చేస్తాడు. ప్రస్తుతం దయ అనే సినిమాతో ఓటిటీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ మధ్యనే తన భార్య తనపై విష ప్రయోగం చేసిందని, దాని నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చిన జేడీ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడుగా జేడీలో కూడా ఆయన పోలికలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో వర్మ లానే ఆలోచిస్తాడు. ఇక గతంలో జేడీ .. ఒక హీరోయిన్ కోసం కృష్ణవంశీతో గొడవపడినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇంటర్వ్యూ పాతది అయినా ప్రస్తుతం వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మహేశ్వరి. జేడీ, మహేశ్వరి జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గులాబీ. ఈ సినిమా అప్పట్లో ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Bhola Shankar: మిల్కీ బ్యూటీతో చిరు డేటింగ్..

గులాబీ కన్నా ముందే కృష్ణవంశీ, జేడీ బెస్ట్ ఫ్రెండ్స్. వారిద్దరూ గులాబీ చిత్రంలో పూజా పాత్ర మీద మనసు పారేసుకున్నారట. ఆ తరువాత పూజా పాత్ర చేసిన మహేశ్వరీ పైన కూడా మనసు పారేసుకున్నట్ల జేడీ చెప్పుకొచ్చాడు. ” మేము ఇద్దరం ఎవరి ప్రయత్నాలు వారు చేసేవాళ్ళం. ఆమె కోసం మేము ఇద్దరం కొట్టుకు చచ్చి, మాట్లాడుకోసం మానేసి.. గులాబీ తరువాత మేము కలిసి సినిమా కూడా చేయలేదు. ఆ అమ్మాయి మాత్రం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని హాయిగా ఉంది. కానీ, మేము మాత్రం ఇప్పటివరకు మరో సినిమా కూడా తీయలేనంతగా మారిపోయాము. మా ప్రేమ విషయం మహేశ్వరికి తెలుసు.. కానీ, లైట్ తీసుకుంది. అసలు ఆమె కోసం మేము అర్ధరాత్రి అరకు నుంచి వైజాగ్ వెళ్లి నేను చాక్లెట్ ఇస్తే.. కృష్ణవంశీ ఏకంగా చాక్లెట్ డబ్బా ఇచ్చేవాడు. అప్పట్లో ఆ వయస్సు అలాంటింది. ఆ సమయంలో ఇలాంటివి చేయకపోతే.. ఇప్పుడు నవ్వుకోవడానికి ఏవి ఉండేవి కావు” అంటూ చెప్పుకొచ్చాడు.