గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్లలో ‘పెద్ది’ ఒకటి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన గ్రాండ్ విజువల్స్తో, పవర్ఫుల్ ఎమోషన్స్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూన్ 4న సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతుండగా, దానికి ఒకరోజు ముందుగానే అంటే జూన్ 3న ఓవర్సీస్, పలు ప్రాంతాల్లో భారీగా ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్, హీరోయిన్ జాన్వీ కపూర్ డబ్బింగ్కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.
సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేందుకు మేకర్స్ ఒక భారీ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ నెల 18 నుంచి చిత్ర యూనిట్ ‘పవర్ప్లే టూర్’ పేరిట గ్రాండ్ ప్రమోషన్లను ప్రారంభించనుంది. ఇందులో భాగంగానే బాలీవుడ్ మార్కెట్ను కూడా టార్గెట్ చేస్తూ ముంబైలో ఒక భారీ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల సమక్షంలో ఈ వేదికపైనే ‘పెద్ది’ అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆమె తన క్యారెక్టర్కు స్వయంగా తెలుగులోనే డబ్బింగ్ చెప్తోంది. జాన్వీ కెరీర్లో తెలుగులో సొంత వాయిస్ ఇస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సినిమా కథ ఉత్తరాంధ్ర (వైజాగ్/శ్రీకాకుళం) బ్యాక్డ్రాప్లో సాగుతుంది. అక్కడి లోకల్ యాసను (స్లాంగ్) పక్కాగా పలకడం చాలా కష్టమైనప్పటికీ, పాత్రలో సహజత్వం లోపించకూడదనే ఉద్దేశంతో జాన్వీ ఈ సవాలును స్వీకరించి డబ్బింగ్ పూర్తి చేస్తోంది.
