TJ Gnanavel: ‘జై భీమ్’ డైరెక్టర్ కొత్త సినిమా.. ఈసారి భర్తను చంపినవాడిపై భార్య న్యాయపోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TJ Gnanavel: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ టిజె జ్ఞానవేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. రియల్ స్టోరీలను ప్రజలకు చూపించడంలో ఈ దర్శకుడు ముందు ఉంటాడు. నిజాన్ని నిక్కచ్చిగా చూపించడంలో టిజె జ్ఞానవేల్ తరువాతే ఎవరైనా.. ఇప్పటికే జై భీమ్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు జ్ఞానవేల్. ఒక దళిత మహిళా న్యాయ పోరాటాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించి విమర్శల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఈ సినిమా ఆస్కార్ కూడా నామినేట్ కావడం విశేషం. ఇక తాజాగా ఈ సినిమా తరువాత మరో రియల్ స్టోరీని తెరకెక్కిస్తున్నట్లు జ్ఞానవేల్ ప్రకటించాడు. ఈసారి భర్తను చంపిన ఒక వ్యాపారిపై భార్య చేసిన న్యాయ పోరాటాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఆ భార్య ఎవరో కాదు జీవజ్యోతి.. తమిళనాడులో సంచలనం సృష్టించిన కేసును దోశా కింగ్ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇది హిందీలో తెరకెక్కడం విశేషం. జీవజ్యోతి అనే మహిళ తన భర్తను చంపిన దోశా కింగ్ రాజగోపాల్ కు శిక్ష పడేలా చేయడానికి 18 ఏళ్ళు న్యాయ పోరాటం చేసింది.
అసలు ఎవరు జీవ జ్యోతి.. ఏంటీ ఆమె కథ అంటే.. చెన్నైలోని శరవణ భవన్ రెస్టారెంట్ చెయిన్ యజమాని పిచ్చై రాజగోపాల్. ఆయనకు ఎన్నో రెస్టారెంట్స్, వ్యాపారాలు ఉన్నాయి. అయితే అతనికి జాతకాల పిచ్చి ఎక్కువ.. ఒకానొక రోజు తన దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి కూతురు జీవజ్యోతిని పెళ్లాడితే.. తనకు రాజయోగం పడుతుందని, తన దశ తిరిగిపోతుందని ఒక పండితుడు చెప్పగా.. ఆమె వెంట పాడడం మొదలుపెట్టాడు రాజగోపాల్. అప్పటికే జీవజ్యోతికి పిన్స్ శాంత కుమార్ తో వివాహమైపోయింది. అయినా ఆమె వెంట పడడం మానలేదు. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని, తనకు మూడో భార్యగా రావాలంటూ వేధించాడు. డబ్బుకు లొంగని జీవజ్యోతి అతడిని చీదరించుకొంది. భర్తను వదిలి రానని చెప్పింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన రాజగోపాల్ 2001 అక్టోబర్ లో జీవజ్యోతి భర్తను హత్య చేయించాడు. భర్త మృతి చెందిన తరువాత జీవజ్యోతి నయయపోరాటం మొదలయ్యింది. రాజగోపాల్ పై కేసు వేసింది. అన్ని ఆధారాలతో అతడు అరెస్ట్ అయ్యాడు. కోర్టు అతడికి జీవిత ఖైదును విధించింది. కానీ అది ఎంతో కాలం నిలవలేదు.
Also Read
- Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
- Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
- Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
- Ajith Kumar: అజిత్తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
అనారోగ్యం కారణంగా రాజగోపాల్ బెయిల్ పై బయటికి వచ్చాడు. దాదాపు 18 ఏళ్లు అతడు బయటే ఉన్నాడు. మళ్లీ 2019 లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం వలన అతడు మళ్లీ జైలుకు వెళ్లాడు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక 18 ఏళ్లు జీవజ్యోతి చేసిన న్యాయపోరాటమే ‘దోశా కింగ్’ సినిమా. జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ స్టోరీపై ఒక పుస్తకం కూడా వచ్చింది. దాని పేరు ‘మర్డర్ ఆన్ ది మెనూ’. ఇక ఈ సినిమాపై జీవజ్యోతి మాట్లాడుతూ తన పడిన కష్టం కన్నా నిజం ఏంటో చూపించాలని, ఇప్పటికైనా నిజం ప్రజలకు తెలియాలని చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
తాజావార్తలు
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
-
Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క