సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ తన రోజువారీ జీవితంలో జరిగేవి అన్నీ అభిమానులతో పంచుకొంటూ ఉంటుంది. ఇక తాజాగా నిన్న సామ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లలో సడెన్ గా కేటీఆర్ ప్రత్యక్షమయ్యారు.. ఆయన ఫోటోను సామ్ షేర్ చేస్తూ “నా ప్రజలే నా బలం నా ధైర్యం నా నమ్మకం” అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఒక్కసారిగా సామ్ అభిమానులు ఉలిక్కిపడ్డారు. రాజకీయాల వైపు కన్నెత్తి కూడా చూడని సామ్ సడెన్ గా కేటీఆర్ ఫోటోను షేర్ చేయడం ఏంటా..? అంటూ తలలు బద్దలు కొట్టుకున్నారు.
సామ్ రాజకీయాల్లోకి వెళ్తున్నావా..? అంటూ కామెంట్స్ కూడా పెట్టుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ కాస్తా వైరల్ గా మారడంతో సమంత డిజిటల్ మేనేజర్ శేషాంక బినాష్ రంగంలోకి దిగింది. సామ్ ఇన్స్టా అకౌంట్ హ్యాక్ కు గురైందని చెప్పుకొచ్చింది. ” ఒక టెక్నీకల్ గ్లిట్చ్ వలన వేరొక గ్రూప్ లో పోస్ట్ చేయాల్సిన పోస్ట్ సమంత గ్రూప్ లో యాడ్ అయ్యింది. మేము ఈ పోస్ట్ ను యాడ్ చేసింది ఎవరు..? ఏంటి..? అనేదాని మీద ఇన్స్టాగ్రామ్ టీమ్ తో మాట్లాడుతున్నాం.. వారు ఎవరో తెలిసిన వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. మీకు ఇలాంటి కన్ప్యూజన్ కలిగించినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాం” అంటూ తెలిపింది. దీంతో అభిమానులు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం సామ్ తెలుగులో యశోద, శాకుంతలం చిత్రాల్లో నటిస్తోంది.