కాయగూరల లక్ష్మీ పతి సమర్పణలో మల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై సాయి చరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ దర్శక, నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఐక్యూ’. కాయగూరల లక్ష్మీపతి, కాయగూరల శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలనతో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభమైంది.
మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, హీరో, హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.యస్. రామారవు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం పాత్రికేయులు సమావేశంలో ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘సినిమా చిన్నదైనా పెద్దదైనా మంచి కంటెంట్ ఉంటే ప్రేకాకధారణ పొందుతుంది. యూత్ ఫుల్ సబ్జెక్టు తో వస్తున్న ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి. జాగ్రత్తలు పాటిస్తూ నిర్మాతలు బడ్జెట్ లో సినిమా తియ్యాలి’ అన్నారు. కె.యస్. రామారావు మాట్లాడుతూ ”ఐక్యూ’ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే విధంగా ప్రతి సీన్ కొత్తగా ఉండాలి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. సో దర్శక, నిర్మాతలు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకున్నా నటనపై ఆసక్తితో సాఫ్ట్ వేర్ జాబ్ వదలి సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకొని వచ్చానని హీరో సాయిచరణ్ చెప్పాడు.